Rahul Gandhi Speech : రాహుల్ స్పీచ్ పై మత పెద్దల ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే?

రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో శివుడి విగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ నేతలతో పాటు పలువురు మత పెద్దలు ఫైర్ అవుతున్నారు. రాహుల్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
Rahul Gandhi Speech : రాహుల్ స్పీచ్ పై మత పెద్దల ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే?

Swamiji's Fired On Rahul : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిన్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో, రాహుల్ శివుని చిత్రాన్ని కూడా చూపిస్తూ ప్రసంగించారు. దీనిపై అధికార కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 1.42 గంటల పాటు (అంతరాయాలు మరియు జోక్యాలతో సహా) సాగిన రాహుల్ ప్రసంగంలోని వివిధ అంశాలపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. రాహుల్ తన ప్రసంగంలో వివిధ మతాల గురించి ప్రస్తావించారు. అహింసాతో బిజెపి (BJP) ని ఎదుర్కోవాలన్నారు. లోక్‌సభలో అధికార పక్ష పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న రాహుల్‌ స్పీచ్ పై వివిధ మత పెద్దలు సైతం రియాక్ట్ అయ్యారు. ఆయన మొత్తం సమాజం పరువు తీశారని, అవమానించారని పలువురు స్వాములు ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ ప్రసంగంపై స్వామి అవధేశానంద్ గిరి మాట్లాడుతూ.. హిందువులు (Hindus) ప్రతీ ఒక్కరిలో దేవుడిని చూస్తారన్నారు. హిందువులు అహింసావాదులు, ఉదారవాదులని అన్నారు. హిందువులు ప్రపంచం మొత్తం తమ కుటుంబమని, అందరి క్షేమం, ఆనందం, గౌరవం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలని చెబుతారన్నారు. హిందువులను హింసావాదులని, వారు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని అనడం సరికాదన్నారు. ఇలాంటి మాటలు చెప్పి మొత్తం సమాజాన్ని అవమానించడమే కాకుండా పరువు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. హిందువులు హింసాత్మకులని, విద్వేషాన్ని పెంచుతారని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నామన్నారు. ఆయన ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలన్నారు.

అఖిల భారత సూఫీ సజ్జదాన్‌షిన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సయ్యద్‌ నస్రుద్దీన్‌ చిస్తీ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో ఇస్లాంలో అభయముద్ర ఉందని అన్నారన్నారు. ఇస్లాంలో విగ్రహారాధన ప్రస్తావన లేదని, ఏ విధమైన కరెన్సీ కూడా లేదన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానన్నారు. ఇస్లాంలో అభయముద్ర ప్రస్తావన లేదన్నారు. రాహుల్ గాంధీ తన ప్రకటనను సరిదిద్దుకోవాలన్నాను.

హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 'అభయముద్ర' చిహ్నాన్ని ఇస్లామిక్ ప్రార్థన లేదా ఇస్లామిక్ ఆరాధనతో అనుసంధానించడం గురించి మాట్లాడారన్నారు. అయితే, ఇది ఏ పవిత్ర గ్రంథం, సాధువుల బోధనలలో ప్రస్తావించబడలేదన్నారు. ఇస్లాం యొక్క తత్వశాస్త్రం, విశ్వాసంతో మరే ఇతర సంకేత సంజ్ఞను అనుబంధించడం సరైనది కాదన్నారు. ఏ మతం, విశ్వాసంతో ఏ చిహ్నాలు ముడిపడి ఉన్నాయో రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం లేకుండా ఏ మతం గురించి మాట్లాడకూడదని సూచించారు.

బీహార్‌ (Bihar) లోని గురుద్వారా పాట్నా సాహిబ్ అధ్యక్షుడు జగ్జోత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా విచారకరమైన రోజన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో మతాలకు సంబంధించిన వాస్తవాలను ప్రదర్శించిన తీరును పరిశీలిస్తే.. ఆయనకు సరైన సమాచారం లేదన్నారు. సభలో అసంపూర్ణ, తప్పుడు సమాచారం అందించారన్నారు. పూర్తి సమాచారం లేకుండా ఏ మతం గురించి కూడా మాట్లాడకూడదన్నారు.

రాహుల్ గాంధీ హింస గురించి మాట్లాడటం చాలా మంచిదన్నారు. అయితే 1984లో సిక్కులపై జరిగిన హింస గురించి అతనికి బహుశా తెలియక పోయి ఉండొచ్చన్నారు. ఆ హింసకు సంబంధించిన చాలా మంది బాధిత కుటుంబాలు ఢిల్లీలోనే నివసిస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి వారి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాలని సూచించారు.

రాహుల్ పార్లమెంటులో ఏం మాట్లాడారు?
లోక్‌సభలో నిన్న ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలిసారి విపక్ష నేతగా పార్లమెంటులో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఆయన మాట్లాడే ముందు బీజేపీ నేతలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా.. రాహుల్‌ జై సంవిధాన్‌ అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. అయితే ప్రసంగంలో రాహుల్‌ గాంధీ శివుని ఫొటో చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను శివుడి నుంచి ప్రేరణ పొందానని వ్యాఖ్యానించారు. దీన్ని స్పీకర్‌ ఓం బిర్లా ఖండించారు. సభలో ఎలాంటి ప్లకార్డులు, గుర్తులు చూపించకూడదని అన్నారు.

శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం కురుకుపోయి ఉంటుందని బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ హిందూ మతం పేరుతో అందరినీ భయపెడుతోందని ధ్వజమెత్తారు. హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని రాహుల్ గాంధీ ప్రశ్నలు గుప్పించారు. స్వయంగా ప్రధాని మోదీ లేచి రాహుల్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment