Andhra Pradesh : హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి తరలించగా.. మిగిలిన వారికి హాస్టల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

New Update
Andhra Pradesh : హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

Food Poison : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్(Food Poison) అయ్యింది. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. మధ్యాహ్నం చికెన్ కర్రీతో బిర్యాని తిన్న తర్వాత కడుపునొప్పి, బ్లడ్‌ మోషన్స్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అందులో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి తీవ్రతరం కావడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రిలోకి తరలించారు. విద్యార్థులకు యాంటిబయేటిక్స్ అందిస్తన్నామని.. వారు కోలుకునేవరకు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిందన్న సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ శ్రీకాంత్, ఫుడ్‌ కార్పొరేషన్ మెంబర్ కిరణ్ హుటాహుటినా ఆసుపత్రికి వచ్చారు.

Also Read: టీఎస్‌ఆర్టీసీ రికార్డు.. ఒక్కరోజులోనే బస్సుల్లో 50 లక్షల మంది ప్రయాణం..

అనంతరం ఫుఢ్‌ కార్పొరేషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ ఆసుపత్రి నుంచి నేరుగా హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. అలాగే జాయింట్ కలెక్టర్ హాస్టల్‌కు డాక్టర్లను పంపించారు. మరికొంతమంది విద్యార్థులకు వైద్యులు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్టల్ సిబ్బంది విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంతో కిరణ్.. వారిపై మండిపడ్డారు. గతంలో ఇదే హాస్టల్‌ సిబ్బందిపై మెమో ఇచ్చినా వారి తీరు మారలేదు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి సిబ్బందిపై చర్యలు తీసుకునేలా చేస్తానని కిరణ్ తెలిపారు.

Also Read: తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment