Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

ఓ కుర్రాడు...కేవలం26 ఏళ్ళు. అతను మొదలెట్టిన పోరాటం బంగ్లాదేశ్ ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది.

New Update
Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

Student Leader Nahid: బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్‌ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్రతరం అయి అక్కడి ప్రభుత్వాన్నే ఏకంగా కూల్చేశాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి...దేశం వదిలి పారిపోయారు. దీనంతటికీ కారణం ఓ 26 ఏళ్ళ విద్యార్థి.

ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసే స్థయి ఆందోళనలు నిర్వహించిన ఆ కుర్రాడి పేరు నహిద్ ఇస్లామ్. ఇతను ఢాకా యూనివర్శిటీలో సోషియాలజీ స్టూడెంట్. జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు, ఉద్యమాలు ఇతను నహిద్ మొదలుపెట్టినవే. బంగ్లాదేశ్ జెండాని తలకు చుట్టుకుని ఇతను చాలాసార్లు మీడియాఓ కూడ నిపింఆడు. మొత్తం ఉద్యమాన్ని ఇతర విద్యార్ధులో కలిపి సమన్వయం చేశాడు. అయితే జూలైలోనే నహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే అక్కడ ప్రజలను ఆకర్షించింది. తర్వాత ఉద్యమం తుఫానుగా మారి ప్రభుత్వాన్నే కూల్చేసింది.

1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్‌ జన్మించాడు. ఇతని తండ్రి ఓ టీచర్‌. నహిద్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు నఖిబ్‌. ఇతను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.నహిద్ ఎప్పుడూ దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడని నఖిబ్ చెప్పాడు. తన సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి.. స్పృహతప్పేలా హింసించారు. ఆ తర్వాత రోడ్డుపై పారేశారు. అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగించాడని నఖిబ్ తెలిపాడు.

బంగ్లాదేశ్ అల్లర్లలో 300మంది దాకా మరణించారు. వీరిలో చాలా మంది విద్యార్ధులు. వీరందరూ యూనివర్శిటీల్లో చదువుతున్నారు. ఈ కారణంగానే ప్రధాని షేక్ హసీనా రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే దీని తర్వాత కూడా నహిద్, అతని విద్యార్ధి బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడంలేదు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి సంఘం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్‌ చెబుతున్నాడు.

Also Read: Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
modi, Hafiz Saeed

modi, Hafiz Saeed

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది. 

Also Read :  జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది

మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది.  సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.   

Also Read :  భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. 

Also Read :  పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

Also Read :  విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!

telugu-news | Jammu and Kashmir | india | Lashkar Chief Hafiz Saeed

Advertisment
Advertisment
Advertisment