Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్‌ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్‌ కి రాహుల్‌ క్రేజీ ప్రశ్న!

ఎంకే స్టాలిన్‌ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్‌ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్‌ చేశారు.

New Update
Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్‌ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్‌ కి రాహుల్‌ క్రేజీ ప్రశ్న!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జాలిగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. చికాగో సరస్సు తీరంలో ఆయన సరదాగా సైకిల్‌ తొక్కారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్‌ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్‌ చేశారు.పెట్టుబడులే లక్ష్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అమెరికాలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో తీరిక వేళలో షికాగోలో సైకిల్‌ రైడ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దీనిపై రాహుల్‌ గాంధీ సరదాగా కామెంట్‌ చేశారు.

దీనికి బదులిచ్చిన స్టాలిన్‌.. ‘‘డియర్‌ బ్రదర్‌.. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్‌ తొక్కుతూ చెన్నై నగరాన్ని ఓ చుట్టూ చుట్టేద్దాం. మీకోసం స్వీట్లు కూడా ఎదురుచూస్తున్నాయి. సైక్లింగ్‌ చేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో దక్షిణాది వంటకాల్ని ఆస్వాదించి.. మిఠాయిల రుచి చూద్దాం’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్‌ సంభాషణ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.

New Update
crisis

crisis

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

America Food Boycott

డోజ్‌ లోని యూఎస్‌ఎయిడ్‌ వ్యవహారాలను చూసే జెరెమీ లూవిన్‌ ఈ ఆదేశాలిచ్చారు అంటూ భాగస్వాములకు పంపిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.దీనికి సంబంధించి దాదాపు 60 కి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందాయి.అమెరికా నిర్ణయం పై ప్రపంచంలో అతి పెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది.వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్‌ పేజీలో పేర్కొంది.ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయం పై ట్రంప్‌ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.ఇప్పటి దాకా చేసిన సాయానికి కృతజ్ఙతలు తెలిపింది.

కోతల నుంచి ఆహారంతో పాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Also Read:EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

Also Read:Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

latest telugu news updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment