JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

మీకు పోలీస్ అవ్వాలని ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లై చేయడానికి వివరాలు కింద చదివేయండి.

New Update
JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Constable Jobs: గత ఏడాది 46, 617 కానిస్టేబుల్ ఖాళీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది మళ్ళీ భారీ సంఖ్యలో ఉద్యోగాలతో వచ్చేసింది. తాజాగా 39,481 కానిస్టేబుల్ నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దీనికి సంబంధించి పరీక్షల జరగనున్నాయి. టెన్త్ పాసయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చును. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 14వరకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 5,6,7 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంది.

సీఐఎస్‌ఎఫ్‌లో 7,145; సీఆర్‌పీఎఫ్‌లో 11,541; ఎస్‌ఎస్‌బీలో 819; ఐటీబీపీలో 3017; ఏఆర్‌లో 1248; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 35, ఎన్‌సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి రాత పరీక్షతో పాటూ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

జీతం..

పే లెవెల్‌ -1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ.  18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌ -3 కింద రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది.

అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్టు లేదా యూనివర్శిటీ నంచి టెన్త్‌ లేదా మెట్రిక్యులేసన్ పాసై ఉండాలి. పురుషులు అయితే 170 సెం.మీ.ల ఎత్తు, మహిళలు అయితే 157 సెం.మీ.లకు ఎత్తు తగ్గకుండా ఉండాలి. అభ్యర్ధులు 18నుంచి 23 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ సడలింపు ఉంది.

పరీక్షా విధానం...

మొత్తం పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకూ రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ ల నుంచి ప్రశ్నలుంటాయి. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు 100 రూ. మహిళలు, ఎస్సీ, ఎస్టీ , మాజీ సైనిక అభ్యర్థులు ఫీజు చెల్లించనక్కర్లేదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం SSC Official Website లో చూడొచ్చు.

Also Read: Maharashtra: బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో కాల్పులు..ఒకరికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment