Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..

తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్‌కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్‌ జలసంధిలోని పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..

భారత జాలర్లను శ్రీలంక నౌకదళం అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలు చేస్తూ 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్‌ జలసంధిలోని పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక నేవి సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది.

అదుపులోకి తీసుకున్న జాలర్లను అధికారులకు అప్పజెప్పామని పేర్కొంది. మరో విషయం ఏంటంటే జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం రెండ్రోజుల్లోనే ఇది రెండోసారు. గత శనివారం కూడా 12 మంది జాలర్లను అరెస్టు చేసి.. వాళ్లకి చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మత్స్యకారులు ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను దాటి తమ జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ సక్సెస్‌!? దావోస్​ పర్యటనలో రేవంత్​ బిజీబిజీ!

మరోవిషయం ఏంటంటే గత కొన్నేళ్లుగా భారత్, శ్రీలంకల మధ్య ఈ మత్స్యకారుల అంశం సమస్యగా మారిపోయింది. అయితే తమిళనాడు, శ్రీలంకను వేరుచేసే పాక్‌ జలసంధిలో చేపల వేట ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చేపల వేటకు వచ్చిన భారత జాలర్లను కూడా గతంలో శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. అలాగే వారిపై కాల్పులు జరిపిన ఘటనలు కూడా ఉన్నారు. 2023లో శ్రీలంక నౌకాదళం మొత్తం 240 మంది మత్స్యకారుల్ని అరెస్టు చేసింది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగతూనే ఉన్నాయి.

Also Read: స్కిల్‌ స్కామ్‌ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్‌ ఇదిగో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అక్రమవలదారులను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈ రూల్ కు అక్కడి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 

New Update
usa

H!-B Visa

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రోజురోజుకూ మితిమీరిన రూల్స్ ను పెడుతోంది. తాజాగా మరో స్ట్రిక్ట్ రూల్ ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం అమెరికా వచ్చిన ఏ దేశస్థుడు అయినా తమ వీసాలు లేదా గ్రీన్ కార్డులను 24 గంటలు తమ వద్దనే ఉంచుకోవాలని చెప్పింది. ఈ నియమం ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్  ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చారని చెబుతున్నారు. ఈ వివాదాస్పద నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలి మరియు వారి వద్ద పత్రాలను ఉంచుకోవాలి. 

Also Read :  ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

అమెరికాలో అక్రమవలసదారులను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీని గురించి ముందుగా ఏమీ చెప్పలేదు కానీ నిర్ణయాన్ని మాత్రం అమల్లో పెట్టేసింది. అమెరికాలో చట్టాలా ప్రకారం దేశంలోకి అడుగు పెట్టిన ప్రతీవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇంతకు ముందు అంతా ఈ రూల్ ను కఠినంగా అమలు చేయకపోవడం వలన చాలా మంది వలసదారులు వచ్చేశారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దానిని అరికట్టడానికే రిజిస్ట్రేషన్  ప్రక్రియను తప్పనిసరి చేయడమే కాకుండా..పత్రాలను కూడా వెంట తీసుకెళ్ళాలని చెబుతున్నామని వివరించారు.  అయితే ఈ కొత్త నియమం అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా నకిలీ పత్రాలతో నివసిస్తున్న వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. దీంతో పాటూ 14 ఏళ్లు పైబడిన వారు మరియు 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నవారు, ఫారం G-325R నింపడం ద్వారా ప్రభుత్వంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, అతని/ఆమె తల్లిదండ్రులు అతని/ఆమెను నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

Also Read :  ఏపీలో విషాదం..ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!

Also Read :  ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?

H-1B వీసా మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ..

అయితే, H-1B వర్క్ వీసా, స్టూడెంట్ వీసా (F1 మొదలైనవి) లేదా గ్రీన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నవారు మళ్ళీ ఫారమ్ G-325R నింపాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటారు కనుక ఈ రిజిస్టర్ ప్రక్రియ వారికి మినహాయించబడింది. అయితే, వారు తమ చెల్లుబాటు అయ్యే పత్రాలను (వీసా, పాస్‌పోర్ట్, I-94, గ్రీన్ కార్డ్ మొదలైనవి) ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలి మరియు US ప్రభుత్వ అధికారులు కోరినప్పుడల్లా ఈ పత్రాలను సమర్పించాలి. 

Also Read: TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

 

h1b visa | new-rule | usa | today-latest-news-in-telugu | today-news-in-telugu | breaking news in telugu | telugu-news | international news in telugu | donald-trump

Advertisment
Advertisment
Advertisment