WTC: 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే!

డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్‌ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది.

New Update
WTC 2025-27 Schedule Release

WTC 2025-27 Schedule Release

WTC: డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్‌ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది. ఇక 2023-25 షెడ్యూల్ జూన్ 11న ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది.  

ఇంగ్లాండ్‌ పర్యటనతో మొదలు..

ఇక 2025-27లో భారత్ మొత్తం మొత్తం 18 టెస్టులు ఆడనుంది. జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనతో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతుంది. ఇండియాలో 9, విదేశీ గడ్డపై 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లాండ్‌తో 5, శ్రీలంకతో 2, న్యూజిలాండ్‌తో 2, వెస్టిండీస్‌తో 2, సౌతాఫ్రికాతో 2, ఆస్ట్రేలియాతో మరోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాంగంగా 5 టెస్టులు ఆడనుంది. 

ఇది కూడా చదవండి: Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్లు లైంగిక దాడి!

టీమ్‌ఇండియా షెడ్యూల్:


ఇంగ్లాండ్- భారత్: 5 టెస్టులు, జూన్-ఆగస్టు 2025
ఇండియా- వెస్టిండీస్: 2 టెస్టులు, అక్టోబర్ 2025
భారత్-సౌతాఫ్రికా: 2 టెస్టులు, నవంబర్-డిసెంబర్ 2025
శ్రీలంక- భారత్: 2 టెస్టులు, ఆగస్టు 2026
న్యూజిలాండ్‌- ఇండియా: 2 టెస్టులు, అక్టోబర్-డిసెంబర్ 2026
భారత్- ఆస్ట్రేలియా: 5 టెస్టులు, జనవరి-ఫిబ్రవరి 2027 (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ)

ఇది కూడా చదవండి: Atishi: కన్నీళ్లు పెట్టుకున్న సీఎం అతిషి.. వీడియో వైరల్

rdr

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sunil Gavaskar : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున అందజేయనున్నట్లుగా తెలిపారు. ఈ ఫౌండేషన్ నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు సహాయం చేస్తుంది.

New Update
Sunil Gavaskar fulfils his promise

Sunil Gavaskar fulfils his promise

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. సునీల్ గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున అందజేయనున్నట్లుగా తెలిపారు. CHAMPS ఫౌండేషన్ నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు సహాయం చేస్తుంది. 1999లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్, కష్ట సమయాల్లో కాంబ్లీకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం. 2025 ఏప్రిల్ 1 నుండి CHAMPS ఫౌండేషన్ ద్వారా వినోద్ కాంబ్లీ బతికి ఉన్నంత వరకు నెలకు రూ.30000 అందిస్తానని సునీల్ గవాస్కర్ హామీ ఇచ్చారు.

Also read :  ఎక్కువ చేయొద్దు.. ఎంపీ చామలకు సీఎం రేవంత్ క్లాస్.. ఆ ఎమ్మెల్యేలకు కూడా..!

 

బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్

ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ  కార్యక్రమంలో వినోద్ కాంబ్లిని సునీల్ గవాస్కర్‌ కలిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంబ్లి గవాస్కర్ పాదాలను తాకారు.  ఆ సమయంలోనే ఆయన పరిస్థితి తెలుసుకున్న గవాస్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా భారత్  తరపున 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి అతని నెలవారీ ఆదాయం రెట్టింపు అవుతుంది, ఇది మాజీ క్రికెటర్ కుటుంబానికి గొప్ప సహాయంగా ఉంటుందని చెప్పాలి.  గవాస్కర్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

Also read : TG crime : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

Advertisment
Advertisment
Advertisment