Virat kohli: టీ20ల్లో ఏకైక మొనగాడు.. కింగ్ ఖాతాలో మరో రికార్డ్!

భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.

New Update
v kohli

Virat Kohli new record in IPL most runs

Virat kohli:  భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. 

42 బంతుల్లో 67 పరుగులు..

ఈ మేరకు IPL 18 సీజన్‌లో భాగంగా ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలు రాయి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 

టీ 20ల్లో టాప్ -5 బ్యాటర్లు:
14562 - క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు)
13610 - అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు)
13557 - షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు)
13537 - కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు)
13050 - విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

ఇదిలా ఉంటే.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 virat-kohli | IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment