IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్

నిన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండిస్ బౌలింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రెండు చేతులతో బౌలింగ్ చేసి వామ్మో అని అనిపించాడు మెండిస్. 

New Update
ipl

SRH Bowler Mendis

నిన్న కోలకత్తాతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవలేదు కానీ...ఈ జట్టులో బౌలర్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్ జట్టు బౌలర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి  ఐపీఎల్ లో వికెట్ తీసుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.  రైట్ హ్యాండర్ బ్యాటర్స్ కు అతను లెఫ్టర్మ్ ఆర్థోడాక్స్‌తో బౌలింగ్ చేశాడు. అదే విధంగా  లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇందులో మళ్ళీ వింతేమిటంటే..అతని బౌలింగ్ యాక్షన్ రెండు చేతులతో కూడా ఒకేలా ఉండడం. నిన్న జరిగిన మ్యాచ్ లో మెండిస్ ఒకే ఒక ఒవర్ వేసి నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 

ఫ్లే ఆఫ్స్ ఆశలు లేనట్లేనా..

ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విషయానికి వస్తే నిన్న కోలకత్తా చేతిలో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఘోరంగా విఫలమైంది. అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు. భారీ అంచనాలు...కానీ ఏం లాభం..హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మ్యాచ్ లు గెలవలేకపోతోంది. వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ ఒక్కడే 33 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు...ఆ జట్టులో బ్యాటర్లు ఎంత ఘోరంగా విఫలం అయ్యారో. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లకే టపాటపా పడిపోయారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే ఈరోజు చేతులెత్తేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 3, వరుణ్‌ చక్రవర్తి 3, రస్సెల్‌ 2, హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోవడంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్లే ఆఫ్స్ కు వెళ్ళడం సందేహమేనా అనుమానం వ్యక్తమవుతోంది.

today-latest-news-in-telugu | IPL 2025 | bowler

Also Read: USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment