Tamim Iqbal: స్టార్‌ క్రికెటర్‌కు గుండెపోటు.. మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే..

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

New Update
Tamim Iqbal

Tamim Iqbal

Tamim Iqbal: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా అతడు సోమవారం మ్యాచ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తమీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈసీజీ, తదితర స్కానింగ్స్‌ చేయించారు. అయితే తమిమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

Also Read: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

 bangladesh | telugu-news | rtv | heart-attack | tamim-iqbal 

తమిమ్‌కు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్‌ మెడికల్‌ అధికారి దేబాశిస్ చౌదరి అన్నారు. అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. అయితే తమిమ్‌ను మొదటగా ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అతని ఆరోగ్య పరిస్థితి వల్ల స్థానిక ఆస్పత్రికే తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Also Read: వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు..

ఇదిలాఉండగా తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ టీమ్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 మ్యాచుల్లో ఆడాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 15 వేల కన్నా ఎక్కువగా పరుగులు చేశాడు. తమిమ్‌కు గుండెపోటు రావడంతో క్రికెట్‌ అభిమానులు షాకైపోయారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.   

Also Read: IPLలో ఆంధ్రా రొయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

today-latest-news-in-telugu | one-day | cricket | icc

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

 

 

Advertisment
Advertisment
Advertisment