SRH vs LSG : ఉప్పల్లో హై ఓల్టేజ్ మ్యాచ్..సన్‌రైజర్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్!

ఉప్పల్ స్టేడియం వేదికగా మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడగా.. LSG మూడు, SRH ఒకసారి మాత్రమే గెలిచింది.

New Update
srh-vs-lsg 7th

ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.  ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన ఊపుతో సన్‌రైజర్స్ ఉండగా.. తొలి విక్టరీ కొట్టాలనే కసితో  లక్నో జట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  రాత్రి7:30 గంటలకు  మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read :  అమెరికాలో RWA పై ఆంక్షలు..!

గత రికార్డులను పరిశీలిస్తే..  

ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నాలుగు సార్లు తలపడగా..  ఇందులో లక్నో జట్టుదే పైచేయిగా ఉంది.  లక్నో మూడు సార్లు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని సన్‌రైజర్స్ అభిమానులు కొందరు టెన్షన్ పడుతున్నారు. మరికొందరు మాత్రం సన్‌రైజర్స్ ఉన్న స్పీడును ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు.  

ఇక మొత్తం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 58 మ్యాచ్‌లు ఆడితే అందులో 36 మ్యాచ్‌లలో విజయం సాధించగా..  21 మ్యాచ్‌లలో ఓడిపోయింది.  మరో మ్యాచ్ టైగా ముగిసింది.  ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ హైయెస్ట్ స్కోర్ 286 పరుగులు.. రాజస్థాన్ రాయల్స్‌పై చేసింది. ముంబై ఇండియన్స్‌పై 2019లో 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే లోయెస్ట్ స్కోర్.  

Also Read :  వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్

Also Read :  బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!

జట్ల అంచనా.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ :  పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

లక్నో సూపర్ జెయింట్స్ :   రిషబ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మర్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరాన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోనీ, శార్థూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్.

Also read :  పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!

 

srh-vs-lsg | ipl-2025 | sunrisers-hyderabad | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment