IPL 2025 CSK Vs RCB: RCB తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే!

చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 197 లక్ష్యం ఉంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్‌ పటీదార్‌ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు.

New Update
CSK VS RCB

CSK VS RCB

IPL 2025 CSK Vs RCB: చెన్నై బౌలర్లు బెంగళూరు బ్యాటర్లపై విజృంభిస్తున్నారు. చాలా వరకు పరుగులను కట్టడి చేశారు. దిగ్గజ బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేర్చారు. సింగిల్ రన్ చేయడానికి కూడా బెంగళూరు జట్టు అవస్తలు పడుతుంది. దీంతో నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సీఎస్కే జట్టు ముందు 197 టార్గెట్ ఉంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్‌ పటీదార్‌ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లున్నాయి. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు

మొదట టాస్ ఓడిన బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చారు. ఫస్ట్ నుంచి ఇద్దరూ దూకుడు ప్రదర్శించారు. కేవలం 4 ఓవర్లలో 37/0 స్కోరు సాధించారు. ఇక దూకుడుగా ఆడుతున్న ఫిల్‌ సాల్ట్‌ (32)ను ధోనీ తన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్‌ బాటపట్టించాడు. కళ్లు తెరిచి మూసేంతలో ధోని వికెట్లను పడగొట్టాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన ఆ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ కూడా దూకుడుగా ఆడాడు. విరాట్, పడిక్కల్ కలిసి కొన్ని పరుగులు రాబట్టారు. కానీ అశ్విన్‌ వేసిన అద్భుతమైన బంతికి పడిక్కల్‌ పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. రుతురాజ్‌ గైక్వాడ్‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రజత్‌ పటీదార్‌ మెల్లి మెల్లిగా ఆడుతూ పరగులు రాబట్టాడు. కానీ అంతలోనే విరాట్ ఔటవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

కోహ్లీ (31)కే ఔటయ్యాడు. ఆ తర్వాత పటీదార్ ఒక్కడే స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఒకానొక సమయంలో ఆర్సీబీ జట్టు ఆ 196 పరుగులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చివరి ఆఖరులో టిమ్‌ డేవిడ్‌ వరుస 3 హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించాడు. అతడు 8 బంతుల్లో 22 పరుగులు రాబట్టాడు. దీంతో ఆర్సీబీ ఈ భారీ స్కోర్ చేయగలిగింది. 

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే !

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్‌ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది.ఈ వివాదం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్‌పై క్లిక్ చేయండి.

New Update
SRH VS HCU

SRH VS HCU

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్‌ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది. ఈ విషయంలో గత రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేస్తోందని చెబుతోంది. మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా HCA ఫ్రీపాస్‌ల విషయంలో గొడవ చేసిందని ఆరోపించింది. దీనిపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆయన ఆదేశించారు. ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ నుంచి బెదిరింపుల వస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందినట్లు హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రతినిధి శ్రీనాథ్‌ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. 

వివాదం ఏంటంటే ? 

తమిళనాడుకు చెందిన సన్‌నెట్‌వర్క్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్‌ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లో ఆడుతోంది. ఐపీఎల్‌ ఆడే సమయంలో ఉప్పల్‌ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతీ మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తోంది. మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీనే చూసుకుంటోంది. స్టేడియ కేపాసిటీ మొత్తం 39 వేలు. ఇందులో 10 శాతం అంటే 3900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో SRH.. హెచ్‌సీఏకు ఫ్రీగా అందిస్తోంది.  

Also Read: UPI సేవలు బంద్.. UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన!

బెదిరించారు

వీటిలో రూ.750 ధర టికెట్ల నుంచి రూ.20 వేలు విలువ చేసే కార్పొరేట్ బాక్స్‌ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్‌ పాసుల విషయంలోనే సన్‌రైజర్స్‌కు, హెచ్‌సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్‌ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఎఫ్‌-12ఏ బాక్స్‌లో గత పదేళ్ల నుంచి హెచ్‌సీఏకు 50 టికెట్లు కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ బాక్స్‌ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని SRHను HCA అడిగగా.. దీనికి ఎస్‌ఆర్‌హెచ్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టికెట్ల కోసం HCA బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి.

బ్లాక్‌ మెయిల్ చేశారు

SRH ప్రతినిధి శ్రీనాథ్‌ రాసిన లేఖలో ఏముందంటే.. '' 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం. గత 2 సీజన్ల నుంచి మాకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం. ఎఫ్‌12ఏ కార్పొరేట్ బాక్స్‌లో 50 టికెట్ల సామర్థ్యం ఉంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం దాని సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే. కానీ అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని హెచ్‌సీఏ అడిగింది. దీనిపై చర్చిద్దామని చెప్పాం. కానీ మార్చిన 27న లక్నోతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఎఫ్‌3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు కూడా దాన్ని తెరవలేదు. మ్యాచ్ మొదలయ్యే సమయంలో ఇలా బ్లాక్‌ మెయిల్ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో కలిసి పనిచేయడం చాలా కష్టమని'' శ్రీనాథ్‌ లేఖలో రాసుకొచ్చారు. 

Also Read: టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. బయటపడ్డ సంచలన వీడియో!

HCA వాదన ఏంటంటే ?

ఇదిలాఉండగా HCA వెర్షన్ మరోలా ఉంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో తాము ఎవరినీ బెదిరించలేదని అంటోంది. SRH నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. ప్రచారంలో ఉన్న లెటర్‌ కూడా ఫేక్‌ అని HCA వాదిస్తోంది. దీంతో అసలు SRH----- HCAకు లెటర్‌ పంపిదా..? లేక SRH దీన్ని బహిర్గతం చేసి HCAపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. 

అయితే చివరికీ ఈ పంచాయితీ సీఎం రేవంత్‌ రెడ్డి వద్దకు చేరింది. SRH యాజమాన్యాన్ని  HCA వేధింపులకు గురిచేస్తుందన్న ఆరోపణలపై ఆయన సీరియస్‌ అయ్యారు. ఫ్రీ పాసుల విషయంలో సన్‌ రైజర్స్‌ను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే HCAపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.  అయితే HCAపై గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ HCA వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు  SRHతో నెలకొన్న వివాదం నిజమని తేలితే రాబోయే రోజుల్లో HCA పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

rtv-news | IPL 2025 | sun-risers-hyderabad | HCA Ticket Issue | telugu-news

Advertisment
Advertisment
Advertisment