R Ashwin: వారిద్దరికంటే నేనే విలువైన ఆటగాడిని.. అశ్విన్!

మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్.. రోహిత్, కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ జీవితంలో విలువైన ఆటగాళ్లు వారిద్దరేనా అనే విలేఖరి ప్రశ్నకు.. తన జీవితంలో అత్యంత విలువైన ఆటగాడు ఎవరు లేరన్నాడు. 'నా వరకు నేనే విలువైన ఆటగాడిని' అంటూ చెప్పుకొచ్చాడు.   

author-image
By srinivas
New Update
rohit

రోహిత్, కోహ్లీపై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

R Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన రవిచంద్రన్‌ అశ్విన్.. రోహిత్, కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన స్పిన్ లెజెండ్.. తన క్రికెట్‌ ప్రపంచంలో తానే సూపర్‌ స్టార్‌నని చెప్పాడు. అలాగే తాను రాసిన ‘ఐ హేవ్‌ ద స్ట్రీట్స్‌: ఎ కుట్టీ క్రికెట్‌ స్టోరీ’బుక్ లో సహచర ఆటగాళ్ల గురించి పొందుపరిచిన పలు అంశాలను షేర్ చేసుకున్నాడు. 

అది పూర్తిగా తప్పు..

నిజానికి నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఈ రోజు చెప్పేస్తా. ఇండియన్ క్రికెట్‌ గురించి చాలామంది ఓ విషయాన్ని అడుగుతుంటారు. కోహ్లీ, రోహిత్‌ గురించే ప్రస్తావిస్తుంటారు. నేను కూడా చిన్నప్పుడు సచిన్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడిని. ఇతర సూపర్‌ స్టార్లు, సెలబ్రిటీల గురించి అలాగే ఆలోచించేవాడిని. అయితే ఆటలో సహచర ఆటగాళ్లు సహకరిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చానంటారు. అది పూర్తిగా తప్పు. నా వరకు నేను, నా తండ్రి, తల్లి జీవితాల్లో అత్యంత విలువైన ఆటగాడిని. రోహిత్‌, విరాట్‌ బయటివారు కాదు. ప్రతిఒక్కరి ప్రయాణం విభిన్నమైనదే. నా వరకు నేనే విలువైన ఆటగాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: Rythu Barosa: తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతుభరోసా ఎంపికలో కీలక మార్పులు

ఇదిలా ఉంటే.. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా రేపటినుంచి నాలుగో టెస్టు జరగనుంది. బాక్సింగ్‌ డే టెస్టుపై టీమ్ ఇండియా రికార్డు బాగుండటంతో గెలుపే లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్‌(42), ఆయుష్‌(30), దీపక్‌(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు.

New Update
harshal-patel

harshal-patel

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ CSK VS SRH మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.  

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

CSK VS SRH

చెన్నై బ్యాటింగ్‌లో బ్రేవిస్‌ 42, ఆయుష్‌ మాత్రే 30 రాణించారు. దీపక్‌ హుడా 22, రవీంద్ర జడేజా 21 ఫర్వాలేదనిపించాడు. షేక్‌ రషీద్‌ 0, శ్యామ్‌ కరన్‌ 9, ధోనీ 6 విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అతడికి మరికొందరు బౌలర్లు తోడయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌ 2, జయదేవ్‌ ఉనద్కత్‌ 2, మహ్మద్‌ షమి 1, కమిందు మెండిస్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

 IPL 2025 | sunrisers-hyderabad | Chennai Super Kings

Advertisment
Advertisment
Advertisment