Nitish Kumar Reddy: నితీష్‌ కుమార్‌ రెడ్డికి బీసీసీఐ బిగ్‌ షాక్.!

ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన నితీష్ కు.. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. 

New Update
nitish kumar reddy

nitish kumar reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ కీలక టోర్నమెంట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ ట్రోఫీలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. నితీష్‌ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నప్పటికీ బీసీసీఐ అతన్ని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఐపీఎల్ 2024 లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇండియా తరఫున వన్డే, టీ20, టెస్ట్.. ఇలా అన్ని సిరీస్‌లలో పాల్గోన్నాడు. 

Also Read : పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు

Also Read :  క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్

ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో తన ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. ఒకానొక సమయంలో సీనియర్లు ఫెయిల్ అయిన చోట సత్తా చాటాడు. దీంతో నితీష్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ జట్టులో అతనికి స్థానం దక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకులోనవుతున్నారు. 

మరోవైపు ఈ ట్రోఫీలో వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్ మన్ గిల్‌, రిషబ్ పంత్‌, KL రాహుల్‌ లాంటి ప్లేయర్స్ కు చోటు కల్పించి.. ఫుల్ ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి ఛాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో సెలక్టర్ల నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులతో పాటు పలువురు విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జట్టు ఇదే!

Also Read :  టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్.. ఎవరతను?

ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shardul Thakur: అలా ఎలా వేశావ్ బ్రో.. ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్.. చెత్త రికార్డ్ ఇదే!

ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్‌గా కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లోనే 11బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

New Update
Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం పలు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో టైటిల్ కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్లు వరుస ఓటములను ఎదుర్కొంటున్నాయి. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన జట్లు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం అందరి అంచనాలకు మించి అద్భుతాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఎవరి ఊహలకు అందని చెత్త రికార్డులతో వార్తల్లో నిలుస్తున్నారు.  

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

చెత్త రికార్డు

ఈ 2025 సీజన్‌లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రీసెంట్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్  VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించినా.. శార్ధూల్ ఠాకూర్ మాత్రం ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. కేవలం ఒక్క ఓవర్‌లోనే 11 బాల్స్ వేశాడు. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

అది మాత్రమే కాకుండా వరుసగా 5 వైడ్లు వేశాడు. ఇది కూడా 2025 సీజన్‌లో ఒక చెత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే లాంగెస్ట్ ఓవర్‌ వేసిన బౌలర్ గా శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన శార్ధూల్ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

(shardul-thakur | IPL 2025 | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment