Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ ఈరోజు జరిగింది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది.  51 పరుగుల తేడాతో సఫారీల మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో కీవీసీ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.

author-image
By Manogna alamuru
New Update
pak

New Zeland Vs South Africa

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరింది. మరో బలమైన ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికాను సెమీ ఫైనల్స్ లో మట్టికరిపించిన న్యూజిలాండ్ ఫైనల్స్ లో భారత్ తో పోటీకి సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 363 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సఫారీలకు ఇచ్చింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా ఫెయిల్ అయింది. బౌలర్ రబాడ కూడా హాప్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. మామూలుగానే పాకిస్తాన్ లోని లాహోర్ స్టేడియం పరుగుల వరద పారిస్తుంది. ఇక్కడ హైయ్యెస్ట్ స్కోరు ఎప్పుడూ 320కు పైనే ఉంది. అలాంటి పిచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. ఏకంగా 363 పరుగులు చేసి భారీ టార్గెట్ ను దక్షిణాఫ్రికాకు ఇచ్చారు. చివరి 5 ఓవర్లలోనే కీవీస్ జట్టు 66 పరుగులు చేసింది. 

ఇద్దరు సెంచరీలు..

కీవీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్స్ 102, రచిన్ రవీంద్ర 108 పరుగులతో ఇద్దరూ శతకాలు చేశారు. ఈరోజు ఇన్నింగ్స్లో కీవీస్ బ్యాటర్లు ఎక్కువ వికెట్లు కోల్పోకుండానే భారీ స్కోరును సాధించగలిగారు. ఒపెనర్ గా వచ్చిన విల్ యంగ్ ఒక్కడే తొందరగా అవుట్ అయిపోయాడు. అతనితో పాటూ ఓపెనింగ్ కు దిగిన రచిన్ రవీంద్ర, తరువాత వచ్చిన కేన్ విలియమ్స్ లు క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు బ్యాటర్లు కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత వచ్చిన డారెల్ మిచెల్ కూడా బాగా ఆడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మిచెల్ 49 పరుగులు చేశాడు.  ఇతని తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కూడా 44 పరుగులు చేశాడు. ఇలా మొత్తానికి 363 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఎక్కువ స్కోరును నమోదు చేశారు న్యూజిలాండ్ బ్యాటర్లు. 

భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మొదట నిలకడగా ఆడారు. అయితే తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేయగలిగారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 50, రస్సీ, వాన్ డర్ డస్సెన్ 69, బవుమా 56 లతో అర్ధసెంచరీలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴IPL 2025 DC vs RR Live Score: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
DC vs RR Live Score IPL 2025

DC vs RR Live Score IPL 2025

RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

dc-vs-rr
dc-vs-rr

 

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

  • Apr 16, 2025 19:38 IST

    IPL 2025 DC vs RR Live Score

    జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే పది పరుగులు 
    జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(1)



  • Apr 16, 2025 19:20 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:19 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:08 IST

    RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

    ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

    dc-vs-rr
    dc-vs-rr

     



  • Apr 16, 2025 14:19 IST

    ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!

    ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్ పాండే స్పందించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO
    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

     



  • Apr 16, 2025 14:18 IST

    ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    సైన్‌బోర్డులకు ఉర్దూ భాష వాడటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్‌ బోర్డుకు ఉండటాన్ని సమర్ధించింది.కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను తిరస్కరించింది. ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని తెలిపింది.

    Supreme Court
    Supreme Court

     



  • Apr 16, 2025 13:16 IST

    ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

    ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను హైదరాబాద్ వ్యాపారి సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

    list



  • Apr 16, 2025 11:28 IST

    రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

    రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

    viral video up
    viral video up

     



  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment