/rtv/media/media_files/2025/04/13/ZphMXKgHOzIIsBvHuhiK.jpg)
Mumbai Indians
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు.
Also Read: సన్రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!
20వ ఓవర్లో 11 రన్స్ రావడంతో స్కోర్ 205కి చేరింది. ఢిల్లీ టీమ్ గెలవాలంటే 206 పరుగులు చేయాలి. వరుసగా ఢిల్లీ నాలుగు మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. మరి ఐదో మ్యాచ్ కూడా గెలుస్తుందా లేదా ఈసారి ముంబయ్కి ఛాన్స్ ఇస్తుందా అనేది కాసేపట్లో తేలనుంది.
Also Read: గర్ల్ఫ్రెండ్ను సూట్కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్
జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
ముంబై ఇండియన్స్ టీమ్
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా