Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. IPL మ్యాచ్‌లకు బుమ్రా దూరం!

IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.

New Update
Jasprit Bumrah set to miss first few games of IPL 2025..

Jasprit Bumrah set to miss first few games of IPL 2025

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. దీని కోసం ఆయా జట్లు సిద్ధంగా ఉన్నాయి. అభిమానులు సైతం తమ ఫ్యాన్సీ జట్ల మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

వెన్ను నొప్పితో దూరం

ఈ ఏడాది జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయంతో బాధపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో రెండవ రోజు అతను ఈ గాయంతో తీవ్ర నొప్పిని ఎదుర్కొన్నాడు. అప్పటి నుండి బూమ్రా పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బుమ్రా తన గాయం నుండి కోలుకుంటున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం.. బుమ్రా ఏప్రిల్ మొదటి వారంలో ముంబై జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని కంటే ముందు అతడు క్రికెటర్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైద్యుల అనుమతి తర్వాత మాత్రమే అతను IPL లో పాల్గొనగలుగుతాడు. 

Also Read :  ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

కాగా ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మార్చి 29న గుజరాత్ టైటాన్స్, మార్చి 31న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో స్వదేశంలో ఆడనుంది. బుమ్రా ఈ మ్యాచ్‌లను కోల్పోయే అవకాశం ఉంది.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment