Ishan Kishan : ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా.. !

ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్  బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. రాజస్థాన్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.  

New Update
ishan century

రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులు సృష్టించింది. ఐపీఎల్‌లో పవర్‌ప్లే అత్యధిక  స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. పవర్ ప్లేలో హైదరాబాద్  ఆటగాళ్లు ఏకంగా  90 పరుగుల మార్క్ ను దాటేశారు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 100 పరుగులు చేసిన జట్టుగా కూడా సన్‌రైజర్స్  నిలిచింది. 6.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 100 పరుగుల మార్కును దాటింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్ర లోనే ఇదే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కూడా సన్‌రైజర్స్ నిలిచింది.

ఇక మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్  బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అంతేకాకుండా , ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.  అంతకుముందు ఈ రికార్డు మనీష్ పాండేపై ఉండేది. 

Also Read :  సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు...IPL చరిత్రలోనే!

Also read :  నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

బౌలర్లకు చుక్కలు చూపించారు

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లకు సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూపించారు.  ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది సన్రైజర్స్. ట్రావిస్ హెడ్ (679 ఫోర్లు, 3 సిక్స్‌)లతో విధ్వంసం సృష్టించగా..  ఇషాన్ కిషన్ (106*11 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు.హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్‌ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also read :  రూ.12 కోట్లు బొక్కా.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment