LSG vs MI: ముంబై నిర్లక్ష్యం.. ఔట్ అప్పీల్ చేయనందుకు 56 పరుగులు అదనం!

ముంబైతో జరుతున్న మ్యాచ్ లో లక్ నవూ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 203/8 పరుగులు సాధించింది. అయితే మార్ష్ తొలి ఓవర్ లోనే 4 పరుగుల దగ్గర ఔట్ అయినా ముంబై అప్పిల్ చేయలేదు. దీంతో మార్ష్ మరో 56 పరుగులు చేశాడు. ముంబైపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

New Update
marsh

IPL 2025 Lucknow huge score against Mumbai

LSG vs MI:ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా నేడు ముంబై వర్సెస్ లక్ నవూ సూపర్ జయింట్స్  మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్ నవూ దండికొట్టింది. 20 ఓవరల్లో 203/8 పరుగులు చేయగా పవర్ ప్లే లో ఓపెనర్ మిచెల్ మార్ష్ విశ్వరూపం చూపించాడు. ఒక్కడే 60 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అయితే ఈ ఆసీస్ స్టార్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ మార్ష్ ను ఔట్ చేసే అవకాశాన్ని ముంబై చేజేతులా వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. 

27 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఈ మేరకు బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్ లో ఔట్ కావాల్సిన మార్ష్ కు ముంబై అనవసరంగా అవకాశం ఇచ్చింది. నాలుగో బంతి మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బ్యాట్ ఎడ్జ్ తాకినా ఎవరు అప్పిల్ చేయలేదు. అల్ట్రా ఎడ్జ్ లో బ్యాట్ స్పష్టంగా తగిలినట్టు చూపించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్.. బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మొత్తం 31బంతుల్లో 60 పరుగులు చేశాడు. చివరికి విగ్నేష్ పుత్తూరు బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తొలి ఓవరల్ ఔట్ అయితే నాలుగు పరుగులే చేసేవాడు. కానీ ముంబై నిర్లక్ష్యం కారణంగా మార్ష్ మరో 56 పరుగులు చేయాల్సివచ్చింది. 

 

 IPL 2025 | mumbai | lucknow | telugu-news

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దంచికొడుతున్న ఆర్సీబీ.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. తాజాగా 10 ఓవర్లు పూర్తయ్యాయి. ఈ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఆర్సీబీ జట్టు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 40*, పడిక్కల్‌ 10* ఉన్నారు. 

New Update
rcb vs rr

ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా ఆర్సీబీ జట్టు బ్యాటర్లు కోహ్లీ, సాల్ట్ క్రీజ్‌లోకి వచ్చారు. 

10 ఓవర్ల స్కోర్

మొదటి నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లతో చెలరేగిపోయారు. తాజాగా తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఆర్సీబీ జట్టు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 40*, పడిక్కల్‌ 10* ఉన్నారు. ఫిల్‌ సాల్ట్‌ (26) ఔట్‌ అయ్యాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

rcb-vs-rr | virat-kohli | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment