KKR Vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. దంచికొడుతున్న లఖ్‌నవూ బ్యాటర్స్!

IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 

New Update
ipl 2025lsg vs kkr

ipl 2025lsg vs kkr Photograph: (ipl 2025lsg vs kkr)

IPL 2025: IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 

తుది జట్లు..

KKR: అజింక్య రహానే (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సునీల్‌ నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, అండ్రీ రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌రాణా, వైభవ్‌ అరోరా, స్పెన్సర్‌ జాన్సన్‌, వరుణ్‌ చక్రవర్తి.

LSG: రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), మిచెల్‌ మార్ష్‌, ఐడెన్‌ మార్కమ్‌, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనీ, డేవిడ్‌ మిల్లర్‌, అబ్దుల్‌ సమద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌, అవేశ్‌ ఖాన్‌, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ. 

ఇక టాస్ అనంతరం ముందుగా బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. పిచ్‌ చాలా బాగుంది. బౌండరీ చిన్నగా ఉంది. అందుకే మేం మొదట బౌలింగ్‌ చేయాలనుకున్నాం. మొయిన్‌ అలీ స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఇక రిషబ్‌ పంత్‌ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని చెప్పలేను. మేం గతం గురించి ఆలోచించడం లేదు. టీమ్‌గా మేం విజయం సాధిస్తున్నప్పుడు కెప్టెన్‌గా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment