Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్  రెండో టీ 20

టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం కుర్రాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సీనియర్లు ఫెయిల్ అవుతున్నా పొట్టి ఫార్మాట్ లో కుర్రాళ్ళు మాత్రం అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచిన భారత టీమ్ రెండో మ్యాచ్ లో కూడా గెలవాలని అనుకుంటోంది.

New Update
cricket

India Vs England T20 Series

ప్రస్తుతం ఇండియా వేదికగా ఇంగ్లాండ్, భారత్ టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. కోలకత్తాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమ్ ఇండియా అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్ అభిషేక్ వర్మ అద్బుతమైన బ్యాటింగ్ చేసి టీమ్ ను విజయం దిశగా నడిపించాడు. 

ఈరోజు రెండో టీ20 మ్యాచ్..

ఈ రోజు చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో ఇప్పటికే అధిక్యంలో ఉంది భారత జట్టు. ఇదే ఉత్సాహంలో రెండో మ్యాచ్ గెలిచి మరింత ముందుకు వెళ్ళాలని చూస్తోంది. మోవైపు మొదటి మ్యాచ్ ఓటమి నుంచి బయటపడి రెండో మ్యాచ్ లో అయినా గెలవాలని పట్టుదలగా ఉంది ఇంగ్లాండ్ టీమ్. ఈడెన్‌ గార్డెన్స్‌లో  బౌలింగ్‌లో విజృంభించి, బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన సూర్యకుమార్ టీమ్.. 43 బంతులుండగానే విజయాన్నందుకుంది. కోల్‌కతా మ్యాచ్ లో స్పిన్నర్లు రెచ్చిపోయారు. అక్కడ పిచ్ కూడా వారికి బాగా సహకరించింది. ఇప్పుడు చెన్నై పిచ్  కూడా స్పిన్నర్లకు సహకరించేది.  ఇది టీమ్ ఇండియాకు అనుకూలించే విషయం. అందుకే ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లిష్‌ జట్టుకు చెక్‌ పెట్టి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమ్‌ఇండియా చూస్తోంది.

చెన్నైలో ఈ రోజు జరిగే మ్యాచ్ లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మ్మద్ షమి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దాదాపు ఏడాది తర్వాత షమి జట్టులోకి వచ్చాడు. అసలు మొదటి మ్యాచ్ లోనే షమి ఆడాలి. కానీ అక్కడ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అతనిని బరిలోకి దింపలేదు. ఇప్పుడు చన్నై పిచ్ కడా స్పిన్నర్లే అనుకూలిస్తుంది. అయినా కడా షమిని జట్టలోకి తీసుకుని ఆడిస్తారని చెబుతున్నారు.  అయితే షమి ఆడితే నితీష్ కుమార్ లేదా రింకూ సింగ్ త్యాగం చేయాల్సి వస్తుంది.

Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment