IPL 2025: ఐపీఎల్‌లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్‌లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!

ధోనీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో అతనుంటే చాలు. ఏ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నో ప్రాబ్లమ్. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. భారత యువప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు. 

New Update
gayle

Chris Gayle interesting comments on Dhoni

IPL 2025: ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగించిన క్రిస్ గేల్ ఈ సీజన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెటర్లకు తాను ఇచ్చే రేటింగ్‌ ఏంటో కూడా చెప్పేశాడు. అలాగే CSK కు ఆడుతున్న ధోనీ ఐపీఎల్‌కు ఎంతో విలువ తీసుకొచ్చాడని చెప్పాడు. ఈ మేరకు ధోనీతోనే ఐపీఎల్‌కు క్రేజ్, వ్యాల్యూ పెరుగుతుందన్నాడు. అతడు ఎంతకాలం ఆడగలిగితే అంతకాలం ఆడించాలని, ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. 

టోర్నీ కల తప్పుతుంది..

ధోనిది గొప్ప వ్యక్తిత్వం. చెన్నై జట్టును ఎన్నోసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతను ఒకవేళ ఐపీఎల్‌ నుంచి వైదొలిగితే టోర్నీ కల తప్పుతుంది. సీఎస్ కే ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. అతనుంటే చాలు ఎక్కడైనా అభిమానులు భారీగా తరలి వస్తారు. ఇలాంటి పవర్‌ కలిగిన వ్యక్తితో ఐపీఎల్‌ విలువ పెరుగుతుంది. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం చాలా అద్భుతం. ప్రతిఒక్కరూ ధోనీ స్కిల్స్‌ను చూడాలని ఆరాటపడతారు. ధోనీ 11వ నంబర్‌లో బ్యాటింగ్ కు వచ్చినా నో ప్రాబ్లమ్' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...

ఇక టీమ్ ఇండయా క్రికెటర్లకు రేటింగ్‌ కూడా ఇచ్చాడు గేల్. రుతురాజ్‌కు 7, జైస్వాల్‌ 9, శుభ్‌మన్‌ గిల్‌ 9,  అభిషేక్ శర్మకు 8, కేఎల్ రాహుల్‌ 8, సూర్యకుమార్ 9, హార్దిక్‌ పాండ్య 7, శ్రేయస్ అయ్యర్ 8, రిషభ్‌ పంత్‌కు 8వ ర్యాంకు ఇస్తానని చెప్పాడు. ఈ యువ క్రికెటర్లంతా గొప్ప ఆటగాళ్లు అవుతారని జోష్యం చెప్పాడు. 

Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

chris-gayle | dhoni | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు