Teamindia: టీమిండియాకు భారీ క్యాష్ ప్రైజ్.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఛాంపియన్స్‌కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్‌ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.

New Update
Why India Players Are Wearing White Blazers During Champions Trophy 2025 Presentation (2)

BCCI'S 58 CRORE PRIZE MONEY FOR TEAM INDIA

టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలవడంతో బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌న ప్రకటించింది. మొత్తం రూ.58 కోట్ల రూపాయలను బహుమతిగా అందజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం క్యాష్ ప్రైజ్‌ను జట్టులో ఉన్న ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌తో పాటు సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు..

టీమిండియాలో అందరూ చేసిన అద్భుతమైన ప్రదర్శనకి ఈ నజరానా ప్రకటించినట్లు బీసీసీఐ తెలిపింది. టీమిండియా దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. దీంతో బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. ఈ నెల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ మొదటి నుంచే న్యూజిలాండ్‌ను కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇప్పటి వరకు టీమిండియా జట్టు మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 

ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PAK vs NZ : బచ్చగాళ్ల ముందు కూడా చేతులెత్తేశారు.. పాకిస్తాన్ పరువు పోయిందిగా!

పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో 84 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ ఓడింది. న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు.  

New Update
Pakistan loss series

Pakistan loss series

పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకుంది.  293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పేలవమైన ప్రదర్శన చేసి 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫహీం అష్రఫ్ (73), నసీమ్ షా(51) పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్  బెన్ సియర్స్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. 

అంతకుముందు న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. మిచెల్ హే(99) పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఏప్రిల్ 5, శనివారం రోజున  మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరుగనుంది. కాగా ఇప్పటికే పాకిస్తాన్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను కివీస్ దక్కించుకుంది.  స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా కివీస్ అదరగొట్టగా..  న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు.  

పాకిస్తాన్ కు ఐసీసీ జరిమానా 

తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ను ఉల్లంఘించినందుకు జట్టుకు ఈ జరిమనా విధించింది ఐసీసీ.  ఆర్టికల్ 2.22 అనేది ఆటగాళ్ళు, ఆటగాళ్ల సహాయ సిబ్బందికి సంబంధించినది.  దీని ప్రకారం ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలోపు బౌలింగ్ చేయని ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.  

Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!
Advertisment
Advertisment
Advertisment