Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు.

New Update
pant IPL 2025

pant IPL 2025

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క బౌండరీ మాత్రమే ఉంది.  దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్, కెప్టెన్ గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జట్టులోకి వచ్చిన పంత్ నుల ఐపీఎల్ 2025 మెగా వేలంలో  రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ చరిత్ర సృష్టించింది, తద్వారా అతను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

గాయం తరువాత కోలుకుని టీమ్ లోకి వచ్చిన పంత్ కు ఆడే అవకాశం రాలేదు.  ఐపీఎల్‌లోకి వచ్చేసరికి పంత్ ఎక్కువగా బెంచ్ మీదే గడిపాడు. ఐపీఎల్‌కు ముందు జనవరిలో ఢిల్లీ తరఫున జరిగిన ఏకైక రంజీ మ్యాచ్ మ్యాచ్ ఆడాడు. అందులో అతను రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అక్టోబర్ నుండి పంత్ ఒక్క పరిమిత ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేదు.  

రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్

రిషబ్ పంత్ 114 ఇన్నింగ్స్‌ల్లో 34.39 సగటుతో 3301 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 34.39, స్ట్రైక్ రేట్ 147.96తో 296 ఫోర్లు, 155 సిక్సర్లు కొట్టాడు. 2024లో రిషబ్ పంత్ 13 మ్యాచ్‌ల్లో 40.55 సగటు, 155.40 స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు .

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment