South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే!

వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

South Central Railway Extended Special Trains : సౌత్ సెంట్రల్‌ రైల్వే (South Central Railway) ప్రయాణికులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను ఇంకా పొడిగిస్తున్నట్లు వివరించింది.. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగిస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్ రైల్వే తెలిపింది.

ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కోరింది. పొడిగించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నట్లు తెలిపింది. కాచిగూడ – మధురై , మధురై – కాచిగూడ, కాచిగూడ – నాగర్‌కోయిల్‌ , నాగర్‌కోయిల్‌ – కాచిగూడ , సికింద్రాబాద్‌-రామనాథపురం, రామనాథపురం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – కొల్లం , కొల్లం – సికింద్రాబాద్‌ డిసెంబర్‌ వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

అలాగే, నర్సాపూర్‌-సికింద్రాబాద్, మచిలీపట్నం – తిరుపతి, సికింద్రాబాద్‌ – అగర్తలా, హైదరాబాద్‌ – జైపూర్‌, హైదరాబాద్ – గోరక్‌పూర్‌, తిరుపతి- షిర్డీ సాయినగర్‌, తిరుపతి-అకోల, అకోల-తిరుపతి,తిరుపతి-కాచిగూడ, సికింద్రాబాద్‌ -దానాపూర్‌, సంత్రాగాచి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌ – లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్‌, కాచిగూడ – తిరుపతి, షాలిమార్‌ – సికింద్రాబాద్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌ – సికింద్రాబాద్‌ (Secunderabad) తో పాటు పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Also Read: ఆడపడచులకు పవన్‌ పసుపు,కుంకుమ కానుక!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 08, 2025 08:32 IST

    ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

    ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.



  • Apr 08, 2025 08:30 IST

    పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

    పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

    Posani Krishnamurali AP Police



  • Apr 08, 2025 08:30 IST

    రాజాసింగ్‌పై కేసు నమోదు

    శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

    Raja singh Murder sketch



  • Apr 08, 2025 08:29 IST

    అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

    ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.4,285 కోట్ల నిధులను విడుదల చేశాయి. మొదట విడత కింద ప్రపంచ బ్యాంకు నుంచి రిలీజ్ చేసింది. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    chandrababu.
    chandrababu

     



  • Apr 08, 2025 07:25 IST

    విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?

    తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Rajanna siricilla
    Rajanna siricilla Photograph: (Rajanna siricilla)

     



  • Apr 08, 2025 07:24 IST

    ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

    ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. చాలా కష్టపడి ఆడిన ముంబయ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడంతో ఆర్సీబీకి విజయం దక్కింది. 

    ipl
    RCB vs MI

     



  • Apr 08, 2025 07:24 IST

    కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

    గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

    అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

    బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.



  • Apr 08, 2025 07:22 IST

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!



  • Apr 08, 2025 07:22 IST

    ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!



  • Apr 08, 2025 07:21 IST

    క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!



Advertisment
Advertisment
Advertisment