Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్..

కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్‌ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి.

New Update
Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్..

మరో నాలుగు రోజుల్లో మే నెల రాబోతుంది. ప్రతినెల లాగే మే నెల ప్రారంభం నుంచి కొత్త ఆర్థిక నియమాలు మారనున్నాయి. అయితే కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యస్‌ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్‌ బ్యాలెన్స్‌.. రూ.50 వేలుగా మారబోతుంది. దీనిపై గరిష్ఠ రుసుము రూ.1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ.25 వేలుగా సవరించారు. ఈ అకౌంట్‌కు గరిష్ఠ రుసుమును రూ.750గా నిర్ణయించారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ.10 వేలు, దీనిపై గరిష్ఠ రుసుము రూ.750గా మారింది.

Also Read: వైసీపీ మేనిఫెస్టో “నవరత్నాలు ప్లస్‌ ” విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..!

ICICI బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్ / ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలతో సహా మరికొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీసు ఛార్జీలను మార్చింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూసుకుంటే.. మే1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 పట్టణ ప్రాంతాల్లో రూ.200 ఉండనున్నాయి. ఇక చెక్‌బుక్‌లో 25 లీఫ్స్‌ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆపైన ఒక్క చెక్‌ లిఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రీవ్యాలిడేషన్‌కు ఛార్జీలను రూ.100లుగా బ్యాంకు మార్పులు చేసింది.

ఇక అతిపెద్ద ప్రైవేట్ రంగం బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ సీనియర్ సిటీజెన్‌ల కోసం అమలు చేస్తున్న HDFC బ్యాంకు 'సీనియర్ సిటీజెన్ కేర్ ఎఫ్‌డీ' గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌స్కీమ్ కింద.. సీనియర్‌ సిటీజెన్లకు రూ.0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంకు అందిస్తోంది. 5-10 సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్‌డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ స్కీమ్ కింద.. సీనియర్ సిటిజన్లు రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇదిలాఉండగా.. మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.

Also Read: నోటా’ పై  సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment