Hyderabad : మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య హైదరాబాద్ మధురానగర్లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 09 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Software Faculty : మధురానగర్ పోలీస్ స్టేషన్(Madura Nagar Police Station) పరిధిలోని ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిడ్జ్ రెసిడెన్సీ(Fridge Residency) లో రవికుమార్ అనే సాఫ్ట్వేర్ను గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు. హత్య(Murder) చేసిన తర్వాత ఆధారాలు దొరక్కుండా కారంపొడి, పసుపు చల్లి పారిపోయారు. రవికుమార్ తలపై బలంగా బాదంతో చనిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకోవడమే కాకుండా టోపీ కూడా ధరించాడు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కూతుర్ని తీసుకొని రవికుమార్ భార్య(Wife) పార్క్కు వెళ్ళారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రవి కుమార్ విగత జీవిగా పడి ఉన్నారు. నిందితుడు డైరెక్ట్గా రవి కుమార్ అపార్ట్మెంట్కే వచ్చి దారుణానికి ఒడిగట్టాడు. అతను వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కూడా అయ్యాయి. అయితే మాస్క్, టోపీ వలన ఎవరు అనేది క్లియర్గా తెలియడం లేదు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. రవఇకుమార్ భార్య, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతనికి ఎవరితో అయినా గొడవలున్నాయా, భూ తగాదాలులాంటి ఉన్నాయా అనేవి విచారిస్తున్నారు. తలపై బలమైన వస్తువుతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు రవికుమార్(Ravi Kumar) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంగా గుర్తించారు పోలీసులు. భార్య, కూతురితో కలిసి ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవి కుమార్ అద్దెకు ఉంటున్నారు. Also Read : మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష #telangana #fridge-residency #madura-nagar-police-station #hyderabad #murder #software సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి