High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది!

ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పెరగడమే కాకుండా, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, చిత్తవైకల్యం లాంటి నరాల సంబంధిత ఆరోగ్య సమస్యల వస్తాయి. అందుకే మీ డైట్‌లో ఉప్పను ఎంత వాడాలో అంతే వాడండి.

New Update
High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది!

High BP: ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. గుండె జబ్బులు, గుండెపోటు నుంచి స్ట్రోక్ లాంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణం. యువతలో కూడా రక్తపోటు సమస్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, పోషకాలు లేని ఆహారం కారణంగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉండవచ్చు. అన్ని వయసుల వారు రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. అప్పుడే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

publive-image

ఉప్పు వద్దు:

వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రజల దృష్టిని కేంద్రీకరించడం, వాటి నివారణపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. పెరుగుతున్న రక్తపోటు, గుండె జబ్బుల సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పు ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఆహారంలో సోడియం మొత్తాన్ని సమతుల్యం చేస్తే, అధిక రక్తపోటు ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

publive-image

సోడియం వద్దే వద్దు:

చైనీస్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం లేదా టేబుల్ ఉప్పును ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం వల్ల అధిక రక్తపోటును 40శాతం తగ్గుతుందని గుర్తించారు. ఉప్పు స్థానంలో దాని ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా, ఆహారంలో పొటాషియం ఉన్న వాటిని ఎక్కువగా చేర్చాలి. సోడియం అధిక రక్తపోటును ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు రక్తనాళాల వాల్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారికి, అధిక ఉప్పు తీసుకోవడం ఈ సమస్యలను మరింత పెంచుతుంది.

ఇది కూడా చదవండి: షాకింగ్‌ స్టడి..తీపి తింటే కాలేయం కాటికే.. ఎందుకో తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు.

New Update
V BREAKING

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు. లేడీ అఘోరీతోపాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షణిని కూడా హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వారిని మోకిలా పోలీసులు పట్టుకున్నారు.

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్టూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని అఘోరీ మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

శుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని లేడీ అఘోరీ డిమాండ్ చేసింది. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

( Uttar Pradesh | aghori | lady aghori arrest | arrest | Mokila | aghori sri varshini | Aghori Sri Varshini)

 

Advertisment
Advertisment
Advertisment