చంద్రబాబు వేసిన క్వాట్ పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో వేసిన క్వాట్ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అలాగే మరో రెండు బెయిల్ పిటిషన్ల మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. బెయిల్ కనుక మంజూరు అయితే బాబు ఈరోజు బయటకు వస్తారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విచారణ మీదనే ఉంది.

New Update
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే..!!

టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ 10వ రోజుకు చేరుకుంది. మధ్యలో పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన 4 పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ జరనుంది. మరోవైపు ఎప్పటిలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రోజువారి దినచర్య సాగుతోంది. ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు తర్వాత బ్లాక్ కాఫీ తీసుకున్నారు. వార్తాపత్రికలను చదివారు. ఇక
ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మిణి , బాలకృష్ణ సతీమణి వసుంధర, మనవడు దేవాన్ష్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇక నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ కూడా ఇవాళ రాజమండ్రి చేరుకునే అవకాశం

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు దాఖలు చేసిన క్వాట్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. జ్యుడిషీయల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు తరుఫు లాయర్లు పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాకలు చేసుకునేందుకు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి వరకు టైమ్ ఙచ్చింది. ఆ గడువు పూర్తవడంతో నేడు క్వాట్ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేయనుంది. అలాగే ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్, సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ మీదన కూడా ఈరోజు విచారణ జరగనుంది. వీటిల్లో ఏ ఒక్కదానిలో అయినా కోర్టు బాబుకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి దగ్గర టీడీపీ నేతలతో కలిసి నివాళులర్పించారు. తరువాత అక్కడే నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు అరెస్ట్ ను నిరశిస్తూ మౌనదీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటూ టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇంకా ముఖ్యనేతలు పాల్గొన్నారు.

చంద్రబాబు తరుఫున హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. తన మీద వేసిన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. బాబు తరఫున ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, అగర్వాల్ సిద్ధం అయ్యారు. అటు ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గా, రంజిత కుమార్ తమ వాదనలు వినిపించనున్నారు. దీంతో హేమాహేమీలు రంగంలోకి దిగిన ఈ కేసులో విచారణ హాట్ హాట్గా జరిగేలా కనిపిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment