Telangana : ఎస్సై సెకండ్‌ సెటప్‌.. భార్య ఆందోళన

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు.

New Update
Telangana : ఎస్సై సెకండ్‌ సెటప్‌.. భార్య ఆందోళన

SI Second Setup : సిద్దిపేట జిల్లా (Siddipet District) కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు (Naga Raju) భార్య మానస (Manasa) .. పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం (Extramarital Affair) లో ఉన్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తున్నాడని వాపోయారు. అతడి కుటుంబ సభ్యులు కూడా వేధిస్తున్నారని ఆరోపించారు.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఎస్సై నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మానసకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎస్సై వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనకు విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని భార్య ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also read: తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Govt : అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

New Update
Telangana State Tourism Development Corporation

Telangana State Tourism Development Corporation

 TG Govt :   కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  మాట్లాడుతూ కశ్మీర్‌లో చిక్కుకున్నవారిని తిరిగి రప్పించడానికి  రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యట‌క శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రదాడిలో తెలంగాణ వారు ఎవరు మరణించలేదన్న ఆయన పర్యాటకులు ఎవరైన కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. దానికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

అలాగే ఇటీవల జమ్ము, కశ్మీర్ లో పర్యటించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. దీనివల్ల పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప‌ర్యట‌క శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామ‌ని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ విషయమైన హెల్ప్ లైన్ నంబ‌ర్లు: 9440816071, 9010659333, 040 23450368 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

 పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.కశ్మీర్‌తో పరిసర ప్రాంతాల్లో పర్యటకులు ఎవరైనా చిక్కుకున్నా వారి నుంచి బంధువులకు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే హెల్ప్‌లైన్‌ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment