IPL 2024: పాపం గిల్..మ్యాచ్ ఓడిపోయారు..ఫైనూ పడింది

అసలే ఓడిపోయి బాధగా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు నెత్పతి మీద మరో పిడుగు పడింది. నిన్నటి మ్యాచ్‌ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు గుజరాత్ కెప్టెన్ గిల్‌కు 12 లక్షల జరిమానా విధించారు.

New Update
IPL 2024: పాపం గిల్..మ్యాచ్ ఓడిపోయారు..ఫైనూ పడింది

Subhman Gill: ఐసీఎల్ 2024 ప్రారంభం అయ్యాక మొదటి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన గుజరాత్ టెటాన్స్ రెండో మ్యాచ్ లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. చనిన్న చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఘోరపరాజయం పాలైంది. దానికి తోడు ఈ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ మీద మరో పిడుగు పడింది. అసలే ఓటమి భారంతో కుంగిపోయిన గిల్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ 12 లక్షల జరిమానా విధించింది. దీనికి స్లో ఓవర్ రేట్. గుజరాత్ టెటన్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం దీనికి ఫైన్ పడుతుంది. అయితే గిల్‌కు ఇది మొదటి తప్పు కాబట్టి తక్కువ మొత్తమే ఫఐన్‌గా వేశామని చెబుతున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఆల్‌ రౌండ్‌ పెర్ఫామెన్స్..

నిన్న చెన్నై చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఇందులో మొదట గుజరాత్ బౌలింగ్ చేసింది. 63 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. తరువాత 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులను మాత్రమే చేయగలిగింది. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్‌ రెహ్మన్‌, తుషార్‌ దేశ్‌పాండే, దీపక్‌ చాహర్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఇక సూపర్ కింగ్స్ టీమ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ర‌చిన్ ర‌వీంద్ర‌(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివ‌మ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెల‌రేగారు. కళ్ళు చెదిరే షాట్లు కొడుతూ ఆద్యంతం అలరించారు.

Also Read:LIC: మన ఎల్‌ఐసీకి తిరుగులేదు..ప్రపంచంలోనే నంబర్ వన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment