Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్‌ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లాలోని రాయపోలు మండలం గుర్రాల సోఫా కూడలి దగ్గర పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వైపు డీసీఎం వాహన డ్రైవర్‌‌ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే డ్రైవర్‌‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను కూడా ప్రాణాలు విడిచారు.

ఈ ప్రమాదంలో మాచినపల్లికి చెందిన వంశీ (19), నవీన్ (20) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిద్దరూ పని కోసం గజ్వేల్‌ జిల్లా కేంద్రానికి బైక్‌ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో మెదక్‌ జిల్లా చేగుంట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం వారిని ఢీ కొట్టింది. డీసీఎం వాహనం.. ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో వంశీ, నవీన్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ డీసీఎం డ్రైవర్‌ రాకేశ్‌ను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Paris Olympics: ఒట్టిచేతులతోనే దేశానికి..వినేశ్ ఫోగాట్ పిటిషన్‌ సస్పెన్స్ కంటిన్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు