Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా బోకకల్‌లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

New Update
Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident : ఖమ్మం(Khammam) జిల్లా బోకకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొంది(Car Accident). దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలనాకి చేరుకున్న పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం

Advertisment
Advertisment
తాజా కథనాలు