Renu Desai: మీకు బుద్ధి ఉందా.. పవన్ నన్ను వదిలేశాడు నేను కాదు: రేణూ ఫైర్

'ఒక దేవుడి అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు' అని రేణూ దేశాయ్ ని ఉద్దేశిస్తూ పవన్ అభిమాని సుధాకర్ పెట్టిన పోస్టుకు రేణూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 'ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అని కోరింది.

New Update
Renu Desai: మీకు బుద్ధి ఉందా.. పవన్ నన్ను వదిలేశాడు నేను కాదు: రేణూ ఫైర్

Pawan kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించినప్పటినుంచి రేణూ దేశాయ్, పవన్ లకు సంబంధించిన రిలేషన్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. పవన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పిన రేణూ.. పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అకీరా, ఆద్య ఫొటోను నెట్టింట షేర్‌ చేసింది. అంతటితో ఆగకుండా 'నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. ఏపీ స్టేట్ ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నా' అంటూ పోస్టులో రాసుకొచ్చింది.

publive-image

ఈ క్రమంలోనే తాజాగా పవన్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా సుధాకర్‌ అనే పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 'మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. అది చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై స్పందించిన రేణూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. ఇలాంటి కామెంట్స్ పెట్టి దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అని కోరింది.

#Pawan Kalyan #ap #renu-desai
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్...

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment