Accident : ఘోర ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు సజీవదహనం రాజస్థాన్లోని సికార్ జిల్లా ఫతేపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. By B Aravind 14 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Road Accident : రాజస్థాన్(Rajasthan) లోని సికార్ జిల్లా ఫతేపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. బ్రిడ్జిపై వెళ్తున్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కాసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కారులో ఉన్నవారు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వాళ్లు అందులోనే సజీవదహనం అయ్యారు. Also read: ఇకనుంచి టవర్స్ లేకుండానే ఫోన్ మాట్లాడొచ్చు : చైనా మృతులందరూ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మీరట్(Meerut) కు చెందినవారని పోలీసులు తెలిపారు. సలాసర్ బాలాజీ ఆలయం నుంచి హిసార్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది(Fire Fighters) ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మంటలను ఆర్పేశారు. కారులో ఉన్న మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read: అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం: మాయావతి #rajasthan #telugu-news #crime-news #road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి