Rahul Gandhi: ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

మతం, కులం, భాష ఆధారంగా.. ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య విభేధాలను సృష్టించి.. వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకురావడమే కాషాయ నేతల ఉద్దేశమంటూ ధ్వజమెత్తారు.

New Update
Rahul gandhi: అబద్ధాలాడి చరిత్రను చెరపలేరు.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్!

ఓవైపు అయోధ్యలో రామమందిరం మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే వేడుకకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్నారు. ఆదివారం అస్సాం-అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం వద్ద రాజ్‌ఘడ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపై మండిపడ్డారు.

Also Read: సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

మతం, కులం, భాష ఆధారంగా.. ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య విభేధాలను సృష్టించి.. వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకురావడమే కాషాయ నేతల ఉద్దేశమంటూ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో యువత నిరుద్యోగం గురించి కలత చెందుతున్నట్లు తనకు చెప్పారని.. అలాగే రైతులు కూడా తమ పంటలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయినట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు మరోసారి మీ గళం వినేందుకు భారత్ జోడో న్యాయ్‌ యాత్రతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. స్కూల్, కళాశాల విద్య కోసం లక్షలు ఖర్చు చేసినా యువత ఉద్యోగం రావడం లేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొందరు పారిశ్రామికవేత్తల బాగు కోసమే పనిచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మేనంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. తమ యాత్ర రాహుల్‌ గాంధీ ప్రయాణం కాదని.. ఇది అస్సాం ప్రజల ప్రయాణమంటూ పేర్కొన్నారు.

Also Read:  రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

రక్తహీనత, హిమోగ్లోబిన్ లేక పిల్లలు, మహిళలు బాధపడుతూ ఉంటారురు.మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Anemia

Anemia

Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు

సరైన ఆహారం తీసుకోకపోవడం..

ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

Also Read:  బ్రో..'లక్కీ భాస్కర్' ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read  రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment