Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం!

గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు.

New Update
Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం!

Pregnant Women: ప్రతిరోజూ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. అయితే.. గర్భవతి కూడా కచ్చితంగా నడవాలని నిపుణులు చెబుతారు. నడక గర్భధారణ సమయంలో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతోపాటు అనేక రకాల సమస్యలను కూడా నివారిస్తుందంటున్నారు. కొందరికీ నడక మంచిదేనా..?, ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని డౌట్ కొందరికి ఉంటుంది. అయితే.. ఏదైనా ఎక్కువ తీసుకోవడం హానిగా ఉంటుంది. ఆ సమయంలో అధిక నడక కూడా ప్రతికూలతలను కలిగి ఉంటుంది. గర్భవతి ఈ సమయంలో ఎంతసేపు నడవాలి అనేది ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో అతిగా నడవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు ఎంత సమయం నడవాలి:

  • గైనకాలజిస్ట్స్ నిపుణులు అభిప్రాయం ప్రకారం..గర్భిణీ స్త్రీ ప్రతివారం 150 నిమిషాల మితమైన ఇంటెన్సిటీ ఏరోబిక్ వ్యాయామం చేయాలంటున్నారు. ఇందులో బ్రిస్క్ వాక్ కూడా ఉంటుంది. గర్భిణీ స్త్రీ ప్రతిరోజూ 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయాలి లేదా నడవాలని శారీరక శ్రమ నిపుణులు అంటున్నారు.

ఎక్కువ నడవడం వల్ల నష్టాలు:

  • గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, నొప్పి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ సమయంలో నడిచే మహిళలు చాలా త్వరగా అలసిపోతారు. అందుకని గర్భదారణ సమయంలో రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మంచిదంటున్నారు. ఎక్కువ నడవడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నడక కోసం చిట్కాలు:

  • గర్భవతి కావడానికి ముందు కూడా వ్యాయామం చేస్తుంటే.. ప్రతి వారం కనీసం 150 నిమిషాల శారీరక శ్రమతోపాటు..నడకను చేస్తే మంది. గర్భధారణ తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే.. నెమ్మదిగా ప్రారంభిచాలని అంటున్నారు.

మ్యూజిక్‌ వింటూ నడక బెస్ట్‌:

  • గర్భవతి ఎక్కువగా నడకకు వెళ్తుంటే.. సౌకర్యవంతమైన బూట్లు వేసుకోసి పాటలు వినటం మంచిది. నీడలో నడవాలి.. ఎండలో ఎక్కువ నడవటం మానుకోవాలి. వాకింగ్‌ చేసే సమయంలో నీరు, స్నాక్స్‌ వంటి పక్కన తీసుకువెళ్లాలని చెబుతున్నారు.

ఎక్కవ లాభాలు:

  • గర్భధారణ టైంలోనే కాకుండా సాధారణంగా కూడా వాకింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే.. గర్భం చివరి దశ రోజులలో నడవడం వల్ల ప్రసవ నొప్పి మొదలైతుంది. లింట్‌గా వాకింగ్‌ చేస్తే ప్రసవ నొప్, సిజేరియన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అందుకని గర్భధారణ సమయంలో రోజుకు 30 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  టొమాటోను వీటితో కలిపితే ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్ అవుతుంది.. తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ ఆర్టీసీ!

గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.

New Update
tgrtc

హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీజీఎస్‌ రోడ్డు రవాణా సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జులై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండటం విశేషం.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం రద్దీ సమయాల్లో సిటీ బస్సులు అధిక లోడ్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.వీరిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు నగరంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో టీఎస్‌ఆర్టీసీ ముందుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం 3,100 బస్సులు నడుస్తుండగా.. రానున్న రోజుల్లో  పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది. 2025 డిసెంబర్ నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ చర్యలు నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

 rtc | electric-bus | Electric busses in telangana | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment