Health Tips : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. రిస్కులో పడ్డట్లే..

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఓ పరిశోధలో తేలింది. రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది.

New Update
Health Tips : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. రిస్కులో పడ్డట్లే..

Why Do I Sleep So Late : ఈ రోజుల్లో ప్రజల జీవన శైలి మారిపోతోంది. తీసుకునే ఆహారం వల్ల, వ్యాయామం చేయకపోడం, శారీరక శ్రమ(Exercise) లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల అనారోగ్యానికి గురువుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులోనే కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిద్రపోయే(Sleeping Habits) సమయాల్లో పలు మార్పులు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని.. యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో ప్రచూరించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక వివరాల్లోకే.. తాజా అధ్యయనం ప్రకారం రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Also Read: ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు..ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!!

ఈ పరిశోధన కోసం దాదాపు 88 వేల మందిని పరిశీలించారు. అయితే ఇందులో 60 శాతం మంది మహిళల(Woman's) వయసు దాదాపు 61 ఏళ్లు ఉంది. వీళ్లలో రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని బయటపడింది. అందుకు రాత్రిపూట తొందరగా నిద్రపోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 7-8 గంటలకు తగ్గకుండా.. అలాగే రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మంచిదని సూచిస్తున్నారు.

Also Read: పాదాలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..గుండెపోటు సంకేతాలు కావొచ్చు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు