Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ!

ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ!

Pawan Kalyan: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో విజయం గెలిచి అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆయన కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ రోజు తన సోదరుడు చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ పై పూల వర్షం కురిపించింది మెగా ఫ్యామిలీ.

పవర్ స్టార్ కు వదిన సురేఖ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. కేక్ కట్ చేసి కుటుంబమంతా సంబరాలు చేసుకున్నారు. అన్న చిరంజీవి, తల్లి అంజనాదేవీ, వదిన సురేఖ పాదాలకు నమస్కారించి ఆశీర్వాదం తీసుకున్నారు పవర్ స్టార్. ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం కనిపించింది. మెగా బ్రదర్ నాగబాబు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. పవన్ ను గెలిపించాలంటూ అనేక సార్లు మెగాస్టార్ పిలుపునిచ్చారు. నాగబాబు అయితే.. పవన్ కు వెన్నంటే ఉండి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. వరుణ్ తేజ్ పిఠాపురం వెళ్లి బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళ్లి పవర్ స్టార్ కు మద్దతు తెలిపారు. ఏది ఏమైనా పవర్ స్టార్ విజయాన్ని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.

New Update
fishing

fishing

ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.

Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!

ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. 

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.

అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.

Also  Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment