Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్‌ ఎదుట మహిళ ఆవేదన!

తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

New Update
Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్‌ ఎదుట మహిళ ఆవేదన!

Mangalagiri: తన కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని చోడవరానికి చెందిన సోమాదుల కృప అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ను కలిసి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దానిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. కబ్జాలు, ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలని కోరుతూ పవన్ కల్యాణ్ కు వినతిపత్రం అందించారు.
publive-image

మీ సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని పవన్ కల్యాణ్‌ ను కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి అనే మహిళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
publive-image

తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పవన్ కల్యాణ్ కు అందించారు. సీనియర్ సిటిజన్స్ సైతం డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఇది కూడా చదవండి: AP: పబ్జి ఆడిన ఉద్యోగి.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Son Accident :  నా ఆలోచనలన్నీ ఆ కుటుంబం గురించే.. వైఎస్ జగన్ సంచలన ట్విట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు.ఈ విషయమై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు.

New Update
Pawan Kalyans Son Mark Shankar

Pawan Kalyans Son Mark Shankar

Pawan Son Accident : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడి పాఠశాలలో చదువుతున్న శంకర్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.  అయితే విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. విశాఖ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

" సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఉప్పూనిప్పూలా పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని.. నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మార్క్ శంకర్ ప్రమాదంపై స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు."సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 


ఇక వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూడా మార్క్ శంకర్ ఇవనోవిచ్ ప్రమాదంపై ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుషు మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ రోజా ట్వీట్ చేశారు.

 
మరోవైపు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్మకూడా ట్విట్‌ చేశారు.సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.అని ఆయన ట్విట్‌ చేశారు.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment