Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు

ఆంధ్రప్రదేశ్‌కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

New Update
Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు

Paramilitary Forces In AP : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు (Paramilitary Forces) వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ (Strong Room) ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా పరిశీలించనున్నారు. ఇటీవల పోలింగ్ జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాతో సహా మరికొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హింసాత్మక ఘటన జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేశారు. తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ అల్లర్లపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగింది.

Also read: ఏపీలో హింసపై రంగంలోకి సిట్.. వారిపై కఠిన చర్యలు!

అయితే ఇటీవలే 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం (Election Commission).. కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీంతో ఈరోజు రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి

Also read: సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల సంచలన ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

విజయనగరంలోని 'రఘు ఇంజనీరింగ్ కాలేజీలో' విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. టీచర్ ఫోన్ తీసుకుందని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్ పై చెప్పుతో దాడి చేసింది.

New Update
Vizianagaram student slapped teacher with shoe

Vizianagaram student slapped teacher with shoe

Viral Video: ఈ తరం విద్యార్థులు గురువుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎంతో సిగ్గుచేటుగా ఉంది. విధ్యా బుద్దులు నేర్పే గురువుపై  బూతులతో రెచ్చిపోయింది ఓ విద్యార్థిని. ఫోన్ తీసుకుందని టీచర్ పై చెప్పుతో దాడి చేసేందుకు తెగించింది. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. 

Also Read: Jwala Gutta :పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల!

Also Read: Ex Dgp Murder Case: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

టీచర్ పై చెప్పుతో దాడి.. 

అయితే వీడియోలో చూపించిన వివరాల ప్రకారం.. టీచర్ విద్యార్థిని నుంచి ఫోన్ తీసుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థిని ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్ ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ తరం పిల్లలు టీచర్లకు ఇచ్చే గౌరవం ఇది? అని ఎత్తిచూపుతున్నారు. 

telugu-news | latest-news | Raghu Engineering College | vijayanagaram

 

Also Read:Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!

Also Read: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
Advertisment