PM Modi: రాహుల్‌ను భారత ప్రధాని చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది-పీ ఎం మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇండియాలోని కాంగ్రెస్ చనిపోతోందని పాకిస్తాన్ ఏడుస్తోంది. దీనిబట్టి వారిద్దరి మధ్య సంబంధం బట్టబయలు అయిందంటూ మండిపడ్డారు. షెహజాదాను ఇండియాకు ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు.

New Update
PM Modi : 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ డేట్ తో ప్రధానికి ఉన్న సెంటిమెంట్ ఇదే!

Pakistan Want 'shehzada' as Next PM of India - Modi: కాంగ్రెస్ పాకిస్తాన్ శిష్యుడు అంటూ కామెంట్ చేశారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన బహిరంగ సభలో మరోసారి కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ (Congress) చచ్చిపోతోందని పాకిస్తాన్ ఏడ్చినప్పుడే అర్ధమైంది వారిద్దరి మధ్యా ఎలాంటి సంబంధం ఉందో అంటూ మోదీ తీవ్ర విమర్శలు చేశారు. షెహజాదాను అంటే రాహుల్ గాంధీని (Rahul Gandhi) తదుపరి ప్రధాని చేయాలని పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు శిష్యరికం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అంటూ కామెంట్ చేశారు. దీనిబట్టి వారిద్దరి మధ్యా ఉన్న భాగస్వామ్యం మరింత బట్టబయలైందని విమర్శించారు. దేశ శత్రువులు ఎప్పుడూ బలహీనమైన ప్రభుత్వాన్నే కోరుకుంటుందని అన్నారు.

ఓటు జీహాదీ అంటే ఏంటో చెప్పాలి..

ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాలకు (Lok Sabha Elections 2024) బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలోనే మోదీ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. దాంతో పాటూ అక్కడి ప్రతిపక్ష నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన ఓటు జీహాద్ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇండియా కూటమి ఓటు జీహాదీ అని పిలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మోదీ నఅ్నారు. మదర్సాలో చదువుకున్నవారికి జీహాద్ అంటే ఏమిటో అందరికీ తెలిసినదేనని మండిపడ్డారు. దీనిని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదని దుయ్యబట్టారు.

రాజ్యాంగాన్ని మార్చేది లేదు...

ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు,ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటోందని ఆయన ఆరోపించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చేదిలేదని..కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు బ్యాక్‌డోర్‌ కోటా ఇవ్వబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆపార్టీ నేతలకు ప్రధాని సవాలు విసిరారు. ముస్లిమ్ రిజర్వేషన్లు, కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ సారి ఎన్నికల్లో తన ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు ప్రధాని మోదీ. ప్రతీ సభలోనూ దీని గురించే ఆయన మాట్లాడుతున్నారు.

Also Read:Karnataka : ప్రజ్వల్ రేవణ్ణపై లుక్‌ అవుట్ నోటీసులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP liquor scam : ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం...  సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
SAJJALA SREEDHAR REDDY

SAJJALA SREEDHAR REDDY

AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్‌ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

శ్రీధర్‌ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్‌ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
   
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్‌ రిపోర్టులోనే ‘సిట్‌’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్‌ యజమానులను రప్పించారు. లిక్కర్‌ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.  

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్‌ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్‌ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్‌ బ్లూ, నైన్‌ హార్స్‌ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment