T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.

New Update
T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్

Pak Vs Canda: మొత్తానికి పాకిస్తాన్ ఒక మ్యాచ్ గెలిచింది. అది కూడా చావో రేవో తప్పదు అన్న పరిస్థితుల్లో. గ్రూప్‌లో ఏలో పాకిస్తాన్ సూపర్ 8కు వెళ్ళాలంటే కెనడాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితి. ఈ మ్యాచ్‌లో కూడా పాక్ జట్టు అతి కష్టం మీద నెగ్గింది. ఇప్పటివరకు పాక్ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. భారత్, అమెరికా ఏతుల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్‌ 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు చేయగా.. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 33బంతుల్లో బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్తో ౩౩ పరుగులు చేశాడు. అయూబ్‌ 6, ఫకార్‌ జమాన్‌ 4లతో వెనుదిరిగారు. ఇక కెనడా బౌలర్లలో డిలల్ఆన్ హేలిగర్ రెండు వికెట్లు...జెమీ గోర్డాన్ ఒక వికెట్ తీశారు.

ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్‌ 44 బంతుల్లో 52పరుగులు చేయగా.. కలీం సనా (13), సాద్ బిన్ జాఫర్ (10), డిల్లాన్ హేలిగర్ (9) పరుగులు చేశారు. నవనీత్ ధాలివాల్ (4), పర్గత్ సింగ్ (2), నికోలస్ కిర్టన్ (1), శ్రేయస్ మొవ్వ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.పాక్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 2, మహ్మద్‌ అమీర్‌ 2, షహీన్ అఫ్రిది, నసీమ్‌ షా తలో వికెట్ పడగొట్టారు.

Also Read:Andhra Pradesh: మరికాసేపట్లో అమిత్‌ షాతో చంద్రబాబు సమావేశం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment