Train Accident : భార్యను కాపాడబోయి.. రైలు కిందపడి భర్త మృతి! రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి..భర్త మృతి చెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది.సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్న క్రమంలో భాను నిద్ర మత్తులో రైలు నుంచి జారి కిందపడింది. ఆమెను రక్షించబోయి సయ్యద్ మృతి చెందాడు. By Bhavana 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Dhone Train Accident : రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి.. భర్త మృతి చెందిన ఘటన నంద్యాల (Nandyala) డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంతి ఎక్స్ప్రెస్ (Prashanti Express) లో జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంట్ల వద్ద అసియాభాను నిద్ర మత్తులో రైలులో నుంచి కిందపడింది. దీన్ని గమనించిన ఆమె భర్త ఆమెను కాపాడే క్రమంలో కిందకి దూకి మృతి చెందాడు. భాను కు తీవ్రగాయాలు కాగా.. చికిత్స కోసం డోన్ ప్రభుత్వాసుపత్రి (Dhone Government Hospital) కి తరలించారు. వీరిద్దరూ నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం (Love Marriage) చేసుకున్నారు. గుంటూరునుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Also read: నా కాళ్ళు మొక్కకండి ప్లీజ్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు #kurnool #done #nandhyala #accident #crime #train సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి