Australia : టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా

ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్‌ టాక్‌తో బోలెడు గ్లోబల్ యాప్‌లను, గేమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది.

New Update
Australia : టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా

China Monitoring  Internet Users : ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం(Australian Government), ఇతర విదేశాల నుండి నిధులు పొందే పరిశోధనా సంస్థ.. మే 2న ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో సమాచారం ప్రకారం చైనా(China) అన్ని దేశాల మీద నిఘా పెట్టింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారందరినీ(Internet Users) పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీని కోసం టిక్‌టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లను వాడుకుంటోందని చెప్పింది. ఫైమస్ యాప్‌లు, గేమ్‌లు అన్నీ కూడా చైనాకు ఇతరుల సమాచారాన్ని అందిస్తున్నాయని ఆధారాలతో సహా చూపించింది. వీటిల్లో రైడ్-షేరింగ్ యాప్ డిడి, యాక్షన్ గేమ్ జెన్‌షిన్ ఇంపాక్ట్ , ప్రసిద్ధ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ లాంటివి ఉన్నాయి.

గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఎకోసిస్టమ్‌(Global Information Ecosystem) ను పునర్నిర్మించడానికి.. ప్రపంచ అధికారంపై తన పట్టును బలోపేతం చేయడానికి, దాని కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి చైనా పట్టుదలగా ఉంది. దాంతో పాటూ తమ దేశ సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక ,సైనిక ప్రభావాన్ని పెంచడానికి.. విదేశాలలో తన ప్రభావాన్ని విస్తరించడానికి చూస్తోందని నివేదిక తెలిపింది. నివేదిక రాసిని ప్రధాన రచయిత సమంతా హాఫ్‌మన్ యాప్‌లు , గేమ్‌ల ద్వారా చైనా చాలా విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారని అంటున్నారు. అయితే చైనా మాత్రం దీని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అది కాకుండా ఆస్ట్రేలియాకు యాంటీ చైనా హిస్టీరియా ఉందని కూడా గతంలో ఆరోపించింది. మరోవైపు యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలోని ఆస్ట్రేలియా-చైనా రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ మెరీనా జాంగ్ ఈ నివేదికను ఖండించారు. అందులో వారు చెప్పిందంతా అతిశయోక్తిగా ఉందంటూ కొట్టిపారేశారు. చాలా పెద్దగా ఉన్నా..అన్ని సోషల్ మీడియా యాప్‌లను కంట్రోల్ చేస్తోంది అనడం అవాస్తవం అన్నారు.

అయితే ఆస్ట్రేలియా మాత్రం టిక్ టాక్‌(TikTok)ను నిషేధిస్తామని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పరికరాల్లో ఇది లేకుండా ఉండేటట్లు చూసుకుంటామని తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్

పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని ట్రంప్ పట్టుబట్టారు.అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచీ దీనిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తామే విమాన ఖర్చులు భరిస్తామని చెప్పారు.

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Bumper Offer To Immigrants

మీ అంతట మీరే వెళ్ళిపోండి...దాని బాధ్యతలు మాత్రం అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వీయ బహిష్కరణ చేసుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమంతట తామే వెళ్ళిపోతే...విమాన ఖర్చులతో పాటూ కొంత నగదును కూడా ఇస్తామని చెప్పారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు. అక్రమ వలసదారులను తమ దేశం నుంచ ఎలా అయినా బటయకు పంపేస్తామని...మేము గెంటేసే కన్నా తమంతట తామే బయటకు వెళ్ళిపోతే మంచిదని ట్రంప్ అంటున్నారు. 

మీ అంతట మీరే వెళ్ళిపోతే మంచిది..

ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు దృష్టిసారించారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారని ట్రంప్ తెలిపారు. సాధారణ సౌరుల కోసం మాత్రం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వెళ్ళిపోయిన లేదా వెళ్ళిపోతున్న వారిలో నేర చరిత్ర లేని వారు ఉంటే వారు మళ్ళీ అమెరికా వచ్చేందుకు కూడా అనుమతిస్తామన్నారు. వారు చట్టబద్ధంగా వెనక్కు రావడానికి సహకరిస్తామని తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే అమెరికా నుంచి చాలా మంది అక్రమ వలసదారులను బయటకు పంపించేశారు. మొదట్లో యుద్ధ విమానాలను ఏర్పాటు చేసి మరీ వారందరినీ తమ తమ దేశాలకు పంపించారు. అయితే యుద్ధ విమానాలకు ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టారు. దాని తర్వాత కూడా అక్రమ వలసలను అరికట్టడానికి, అమెరికాలో ఉంటున్న వారిని పంపించేందుకు చాలానే చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సైతం అక్రమ వలసదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి అక్రమంగా ఉంటున్నవారు కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాలని తెలిపింది. ఒక వేళ అలా రిజిస్టర్ చేసుకోకపోతే ఫైన్ లేదా జైలుశిక్ష విధిస్తామని కూడా తెలిపింది. 

 

today-latest-news-in-telugu | usa | america president donald trump | illegal immigrants america

Also Read: HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

Advertisment
Advertisment
Advertisment