Delhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన!

మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆర్యన్‌ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Delhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన!

Delhi Crime: మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.నార్త్-వెస్ట్రన్ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం...ముఖర్జీ నగర్‌ లోని ఆటం లేన్‌ ప్రాంతంలో మెహక్‌ బన్సాల్ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు.

ఆ ఇంటికి సమీపంలో సునీల్‌ కుమార్‌ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం సునీల్‌ కుమారుడు ఆర్యన్‌ బయట వీధిలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బన్సాల్‌ కారులో బయటకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆర్యన్‌ ను బన్సాల్‌ కారుతో బలంగా ఢీకొట్టాడు.

దీంతో కారు కింద పడి చిన్నారి మృతి చెందాడు. విషయాన్ని గమనించిన సునీల్‌ అతని భార్య పరుగుపరుగున వచ్చి చూడగా కారు కింద కుమారుడు ఆర్యన్‌ రక్తపు మడుగులో కనిపించాడు. ప్రమాదం జరిగిన వెంటనే బన్సాల్‌ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా సునీల్‌ దంపతులు ఆర్యన్‌ ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని వేడుకున్నారు.

దీంతో బన్సాల్‌ తన కారులోనే ఆసుపత్రి వరకు తీసుకుని వెళ్లాడు. వారు ఆసుపత్రిలోనికి రాగానే నిందితుడు బన్సాల్‌ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహక్‌ ను సంప్రదించడానికి చాలా సార్లు ప్రయత్నించారు. కానీ అతను వారికి ఫోన్‌ కు సమాధానం ఇవ్వలేదు. దీంతో నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also read: ‘ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు’ : రాహుల్‌ గాంధీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment