Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్‌ ముప్పు..

అమెరికాలోని సాలెం అనే ఆసుపత్రిలో జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. తమ వద్దకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అయితే వీటి సంక్రమణ ముప్పు తక్కువేనని వైద్యులు తెలిపారు.

New Update
Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్‌ ముప్పు..

ప్రాణాలు కాపాడేవారే వైద్యులు.. కానీ అదే వైద్యులు మనిషి ప్రాణాలను ప్రమాదంలోకి పెడితే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. కొంతకాలంగా అక్కడ ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. అయితే ఈ ప్రక్రియలో శరీరం లోపలికి పంపించే ట్యూబుతో కూడిన ఓ పరికరమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికా మాసాచుసెట్స్‌లోని సాలెం అనే ఆసుపత్రి ఉంది. అయితే ఈ ఆసుపత్రికి రోజూ రోగులు వస్తూనే ఉంటారు. అయితే ఇటీవల హస్పిటల్ యాజమన్యం తమ వద్దకు వచ్చే రోగులకు నిర్వహిస్తోన్న వైద్య పరీక్షలకు సంబంధించి కీలక విషయాన్ని గుర్తించింది.

తాము నిర్వహించే ఎండోస్కోపీ విధానంలో నిర్వహణ లోపం వల్ల కొంతమంది రోగులు ప్రాణాంతక వ్యాధులకు గుర్యయ్యే అవకాశం ఉందని నిర్దారించింది. మరీ ముఖ్యంగా జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు రెండేళ్ల కాలంలో ఎండోస్కోపీ చేసుకున్న 450 రోగులు హెచ్‌ఐవీ, లేదా హెపటైటిస్ బీ, సీ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు తమ ఆసుపత్రి వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఇది జరిగిందని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని తమ వద్దకు వచ్చే రోగులకు చెప్పినట్లు ఆ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ వైద్య సేవల వల్ల ప్రభావితమైనవారికి క్షమాపణలు తెలియజేస్తున్నామని పేర్కొన్నాయి. అయితే ఈ సంక్రమణ ముప్పు చాలా తక్కువగానే ఉంటుందని.. ఈ విషయానికి సంబంధించి సంబంధిత రోగులకు ఈమెయిల్, ఫోన్‌ ద్వారా కూడా చెప్పామని పేర్కొంది.

Also Read:ఉత్తరం అయిపోయింది…దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్

అయితే అప్పటినుంచి వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బీ, సీ పరీక్షలు క్రమంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు ఎవరూ కూడా ఆ ఇన్‌ఫెక్షన్ల బారిన పడినట్లు తేలలేదని తెలిపాయి. రోగులకు అవసరమైన సాయం, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై మసాచుసెట్స్‌ ప్రజారోగ్య విభాగం స్పందించింది. ఈ వ్యాధుల బారినపడే ముప్పు చాలా తక్కువేనని.. దీనిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment