అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఎలా ఉండబోతోంది?

అమెరికా నుంచి మొదటి విడతలో 104 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. బహిష్కరణకు గురైయ్యారు. తిరిగి దేశానికి వచ్చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళగలరా? వాళ్ళని మోసం చేసిన ఏజెంట్లకు శిక్ష పడుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

author-image
By Manogna alamuru
New Update
us

Deportees From USA

ఏజెంట్ల చేతిలో మోసపోయి..లక్షలు పోగొట్టుకుని...అటు కలలు కన్న అమెరికాలో ఉండలేక..బహిష్కరణకు గురై అంతకు మించి అవమానం పాలై మొత్తం 104 మంది ఇండియాకు తిరిగివచ్చారు. తిరిగి వచ్చారు అని చెప్పడం కంటే ఖైదీల్లా కట్టేసి తీసుకువచ్చారు అని చెప్పడం కరెక్ట్ ఏమో. ఇలా వచ్చిన ప్రతీ ఒక్కరిదీ ఒకో కన్నీటి గాధ. మంచి జీవితం కోసం తాపత్రయం పడితే అదీ దక్కలేదు...ఇండియాలో కూడా మామూలుగా జీవితం జీవించే పరిస్థితి లేదు. ఇప్పుడు తాము ఎలా ఉండాలనేది  వారందరి ప్రశ్న. వీళ్ళందరూ డాంకీ రూట్ ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించిన వాళ్ళే. మెక్సికో బోర్డర్ లో పట్టుబడి, అక్కడ కొన్నాళ్ళు బందీలుగా ఉండి..ఇప్పుడు భారత్ కు తిరిగి వచ్చారు. ఇప్పుడు వీరి భవితవ్యం ఏంటి అని అందరూ అడుగుతున్న ప్రశ్న. 

సాధారణ భారతీయుడిలా బ్రతకాలి...

అమెరికా వెళ్ళాలని, బాగా బతకాలని ఎన్నో కలలు కన్నారు. అవన్నీ కల్లలు అయ్యాయి. దానికి తోడు డబ్బులు కూడా పోయాయి. దీంతో అమెరికా నుంచి వారందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇలా వచ్చిన వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉండవు అని చెబుతున్నారు. నిజమైన పాస్ పోర్ట్ ఉండి, చెల్లుబాటు అయ్యే పత్రాను ఉపయోగించినట్లైతే వారిని ఎవరూ ఏ చేయరు అని చెబుతున్నారు ఢిల్లీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కెకె. మనన్. నకిలీ పాస్ పోర్ట్ లు, లేదా ఫోటోలు ఉపయోగించిన వారు...మోసపూరితంగా అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించిన వారి మీద మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన వారిలో చాలా మంది తక్కువ చదువుకున్న వారు, పేద కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తులు నకిలీ పత్రాలను తయారు చేయడంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు. వీళ్ళు ఇక్కడ అంతా ప్రోసీజర్ అయిపోయాక వాళ్ళ ఊళ్ళు లేదా గ్రామాలు వెళ్ళి ఎప్పటిలానే బతకొచ్చని చెబుతున్నారు.     

మళ్ళీ అమెరికా వెళ్ళే ఛాన్స్...

ఇప్పుడు బహిష్కరణకు గురైన వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా..అంటే కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలంటే తప్పనిసరిగా వీసా ఫారమ్ నింపాల్సి ఉంటుంది.  అందులో ఎప్పుడైనా బహిష్కరణకు గురైయ్యారా అనే ప్రశ్న ఉంటుంది. దాని కచ్చితంగా నింపాల్పి కూడా ఉంటుంది. అందులో గురయ్యామని చెబితే మళ్ళీ వీసా ఇవ్వరు. ఒక్క అమెరికానే కాదు దీనివలన చాలా దేశాలు వీసాలు నిరాకరిస్తాయి. అంతేకాదు ఇప్పుడు బహిష్కరణకు గురైన వాళ్ళు 5 నుంచి 10 ఏళ్ళ వరకూ అసలు వీసా దరఖాస్తు చేసుకోవడానికే ఒప్పుకోరు అని చెబుతున్నారు. 

ఏజెంట్లపై చర్యలు తీసుకుంటారా..

లక్షల రూపాయలు తీసుకుని అమాయకులను మోసం చేసిన ఏజెంట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు వచ్చిన్పుడు..వారిపై చ్చింగా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు కే.కే. మనన్. ట్రావెల్ ఏజెన్సీలను పట్టుకుని...ఏజెంట్లపై చర్యలు తీసుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ వ్యక్తులను చట్టవిరుద్ధంగా అక్కడికి పంపడంలో ప్రధాన పాత్ర పోషించిన వారే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని చెప్పారు. బహిష్కరణకు గురైన వారిని విదేశాలకు ఎవరు పంపారు మరియు వారిని ఎలా పంపించారు అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా లేవనెత్తాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. సైబర్ డొమైన్‌లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA), రాష్ట్ర పోలీసు అధికారుల సహకారంతో అక్రమ నియామక ఏజెంట్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: USA: మొదట మిస్ అయింది...తరువాత కూలిపోయింది...అమెరికాలో మళ్ళీ విమాన ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

కర్ణాటకలో దారుణం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధించాడు. నిద్రిస్తుండగా ఆమె పక్కనే నిలబడి పదేపదే టచ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

New Update
Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం, మంచి మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా.. వంద మందిలో ఉన్నా.. పాడు బుద్దితో అతి నీచంగా, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గతం కంటే ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. 

Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ యువతి పక్కనే నిలబడి.. చేతులతో టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కండక్టర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కామ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

నిద్రపోతున్న యువతిపై

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుంది. అదే సమయంలో బస్సు కండక్టర్ ఆమె పక్కకి వచ్చి నిలబడి ఆ యువతిని పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఆమె కూర్చున్న సీట్‌ పక్కనే నిల్చుని మెల్ల మెల్లగా చెయ్యి వేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. 

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

viral-news | viral-video | crime news
Advertisment
Advertisment
Advertisment