Delhi: పొట్టి దుస్తులు ధరించండంపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు తేల్చి చెప్పింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.బార్‌లో అశ్లీల డ్యాన్స్‌ చేసినందుకు అభియోగం మోపబడిన 7గురు మహిళలను నిర్ధోషులుగా ప్రకటించింది.

New Update
Wearing small clothes not a crime, Says Delhi Court

Wearing small clothes not a crime, Says Delhi Court

సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో కొందరు పొట్టి దుస్తులు ధరిస్తుంటారు. అయితే దీనిపై ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇలా దుస్తులు ధరించడం నేరం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలోని బార్‌లో అశ్లీల డ్యాన్స్‌ చేసినందుకు గాను గత ఏడాది అభియోగం మోపబడిన 7గురు మహిళలను న్యాయస్థానం నిర్ధోషులుగా ప్రకటించింది. 

Also Read: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఢిల్లీలోని ఓ బార్‌లో యువతులు పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ఆ బార్‌వైపు పెట్రోలింగ్‌ వెళ్లిన పోలీసులు ఆ మహిళలను చూశారు. దీంతో వాళ్లపై పహర్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బార్‌లో పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి నిందితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చిన్న దుస్తులు ధరించడం నేరం కాదని ప్రకటిస్తూ వాళ్లని నిర్ధోషులుగా తేల్చింది.  

Also Read: మణిపుర్‌ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు

అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యారా? అనేదాన్ని పోలీసులు నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. పోలీసుల ఫిర్యాదుకు ఎలాంటి విలువ లేదని చెప్పింది. అలాగే ఈ కేసులో నేరం జరిగిందని నిరూపించడంలో పూర్తిగా విఫలమైనట్లు చెప్పింది. పోలీసులు దీనిపై కల్పితాలు సృష్టించినట్లు స్పష్టంగా తెలుస్తోందని మండిపడింది. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమేం కాదని.. వారివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితేనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Also Read: మణిపుర్‌ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment