Watch Video: హిమాచల్‌ప్రదేశ్‌లో భయంకరమైన బస్సు ప్రయాణం.. వీడియో వైరల్

హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయి. కొండల అంచుల్లో బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి.

New Update
Video Of Bus Journey In Himachal Goes Viral

Video Of Bus Journey In Himachal Goes Viral

హిమాచల్‌ప్రదేశ్‌ అంటే మనకు గుర్తుకువచ్చేది అందమైన ప్రకృతి. కొండలు, లోయలు, జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది ఆ రాష్ట్రం. అక్కడ ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉండటం, లోయలకు దగ్గరగా ఉండటం వల్ల రోడ్లపై ప్రయాణం చేయాలంటే భయంకరంగా ఉంటుంది. నిజానికి అలాంటి దారిలో వాహనాలు నడిపించడం పెద్ద సాహసమే. అయితే హిమాచల్‌ప్రదేశ్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి సంబంధించి ఓ కంటెంట్‌ క్రియేటర్‌ సోషల్‌ మీడియాలో వీడియో షేర్ చేశారు. 

Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన

తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బస్సు ప్రయాణం చేశామని రాసుకొచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లినవారు ఎప్పుడైనా అక్కడ ప్రజా రవాణా సదుపాయాలు వినియోగించుకున్నారా అని అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తైన కొండల్లో వాటి అంచున బస్సు ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెటిజన్లు ఆ బస్సు డ్రైవర్ల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.  

క్లిష్ట పరిస్థితుల్లో కూడా బస్సులను జాగ్రత్తగా నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న వాళ్లని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. '' ఇది చంబా అనే ప్రాంతం నుంచి పంగి అనే మరో ప్రాంతానికి వెళ్లే రహదారి'' అని రాసుకొచ్చారు. మరో నెటిజన్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రజలు కొండల అంచున కాదు తమ జీవితాల అంచున ప్రయాణం చేస్తారని కామెంట్ చేశారు. 

Also Read: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?

Also Read: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment